అమ్మాయికి పెళ్ళి చూపులు! వరుడు నచ్చలేదనుకోండి ఆ విషయం గట్టిగా చెప్పేస్తుంది ఆ అమ్మాయి. నచ్చాడనుకోండి! నచ్చాడని చెప్పదు. మీ ఇష్టం నాన్నా అంటుంది.
రాహుల్ గాంధీ కూడా అలాగే చేసారు. తనకి నచ్చని గవర్నమెంట్ ఆర్డినెన్స్ మీద వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి పదవి మాట వచ్చేసరికి అందరూ ఏం చెప్తే అది అంటున్నారాయన. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎంపీలంతా తనే ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటే తనకు సమ్మతమేనని మనసులో మాటను బయటపెట్టేసారు రాహుల్ గాంధీ జార్ఖండ్ పిసిసి సీనియర్ నాయకుల సమక్షంలో.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారసారధిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ, తనను కాంగ్రెస్ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి అని పిలవటం తనకి ఇష్టం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అలా ఎన్నికల ముందుగానే ప్రధాన మంత్రి అభ్యర్థినికానీ ముఖ్యమంత్రులను కానీ ప్రకటించే ఆనవాయితీ లేదని కూడా రాహుల్ గాంధీ అన్నారు.
పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించకముందే మీడియా అంతా భాజపా అభ్యర్థి నరేంద్ర మోదీతో పోల్చటం మొదలుపెట్టింది. ఇక ప్రకటనే చేస్తే రకరకాల విమర్శలు వచ్చి ప్రజలలో ముందుగానే తప్పు సంకేతాలు వెళ్ళే అవకాశం ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
అయితే జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యంబేలా అన్నట్లు టివిల్లోనూ ఇతర ప్రచార సాధనాలలోనూ రాహుల్ గాంధీని నాయకుడిగా చెప్తూ ప్రచారం జరుగుతూనేవుంది. పైగా వంట గ్యాస్ సిలెండర్లను రాయితీలో సంవత్సరానికి 9 నుంచి 12 కి పెంచమని ఆయన చేసిన సలహా అమలులోకి వచ్చేస్తోంది కూడా. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపించిందని దాన్ని పూరించటం ఎంతో అవసరమని కూడా కాంగ్రెస్ పార్టీ అప్రకటిత ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అన్నారు.
ఈరోజు రాహుల్ గాంధీ మోదీ కంచుకోట గుజరాత్ ని భేదించటానికి సిద్ధమౌతున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం గుజరాత్ లో జరుగనుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more