It professionals conducting tdp yuva chaitanya sadasu

IT Professionals, TDP Yuva Chaitanya Sadasu, Ramya Grounds, KPHB, Hyderabad,

TDP Volunteers and IT Professionals are conducting one major event in Hyderabad.

బాబు రావాలి... బాగు పడాలంటున్న ఐటీ ఉద్యోగులు

Posted: 01/24/2014 09:13 PM IST
It professionals conducting tdp yuva chaitanya sadasu

రానున్న 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్న లక్ష్యంతో ఏర్పడ్డ ‘బ్రింగ్ బాబు బ్యాక్ ’ ఫోరం నిర్వహిస్తున్న ‘టీడీపీ యువ చైతన్య సదస్సు ఈ రోజు సాయంత్రం   హైదరాబాద్ లోని కేబీహెబీ లో రమ్య గ్రౌండ్స్ లో టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు కలిసి పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు టీడీపీ నేత నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం కూకుట్‌పల్లి 7వ ఫేజ్‌లోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో సాయంత్రం 4గంటలకు ఈ సదస్సు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఫోరం వాలంటీర్లు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే... ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎలా వెనకబడిపోయిందో తెలియజేస్తూ, అవినీతి పాలకుల భరతం పట్టాలంటే... మళ్ళీ తెలుగు దేశం అధికారంలోకి రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు నివ్వనున్నారు.

ఈ సదస్సులో ‘బాబు రావాలి... బాగు పడాలి ’ అనే నినాదాన్ని కూడా చెప్పబోతున్నారు. ఈ సదస్సులో నారా లోకేష్ బాబు ఐటీ ఉద్యోగుల్ని, యువతను చైతన్య వంతం చేస్తాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles