తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శశి థరూర్ మీద గృహ హింస కేసు నమోదు చెయ్యాలని, ప్రభుత్వం అందులో జోక్యం కలిగించుకోగూడదని అన్నారు.
ఐ లవ్ యూ అనే మూడు పదాల ముచ్చటైన ప్రేమ సందేశం ప్రేమికుల మధ్య బాగానే వుంటుంది కానీ వైవాహిక జీవితంలో ఉన్నవారి మధ్య గొడవలు రేపుతుంది. శశి థరూర్, సునందల వైవాహిక జీవితంలో విషాన్ని చిందించిన ఆ ట్విట్టర్ సందేశం పాకిస్తాన్ పాత్రికేయురాలు తరార్ థరూర్ కి పంపించినట్లుగా చెప్తూ దాన్ని బహిరంగ పరచింది థరూర్ భార్య సునంద. ఆ తర్వాత అనుమానస్పదంగా శవంగా మారిన సునంద మృతి మీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణించిన పంచతార హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తూ, టెలిఫోన్ లోని గతంలోని కాల్స్, మెసేజ్ లను వెలికి తీసి వాటి ద్వారానూ సునంద మరణానికి కారణాన్ని కనిపెట్టే దిశగా పోలీసులు యత్నిస్తుండగా ఛాతీలో నొప్పితో శశి థరూర్ ఐమ్స్ లో చేరటం, తిరిగి డిశ్చార్జ్ అవటం కూడా జరిగింది.
అయితే మహిళలను విలాసవస్తువులుగా మాట్లాడిన శశి థరూర్ ని మంత్రి పదవి నుంచి సత్వరమే తొలగించి ఆయన మీద గృహహింస చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని, ఆ కేసులో రాజకీయ ప్రమేయం ఉండగూడదని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆయన అలా డిమాండ్ చెయ్యటం కూడా రాజకీయ ప్రమేయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భాజపాతో పొత్తుకి తెదేపా కానీ భాజపా కానీ ఇంతవరకు అథికారికంగా ఎటువంటి ప్రకటనలూ చెయ్యకపోయినా, ఆ రెండు పార్టీల నాయకుల మధ్య జరిగిన భేటీతో పొత్తు ఏర్పడిందని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. దానికి తోడు ఆ భేటీల అనంతరం తెదేపా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతుండటం అందుకు మరింత ఊతమిస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతానని అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలు మరీ బలాన్నిస్తున్నాయి ఆ పొత్తుల ఊహలకు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more