Seemandhra ministers meet on jairam ramesh

seemandhra ministers meet on jairam ramesh, Jairam Ramesh, Minister Jairam Ramesh, seemadhra central ministers, samaikyandhra, GOM, sonia gandhi,

seemandhra ministers meet on jairam ramesh

జైరామ్ రమేష్ భలే సలహా ఇచ్చారు?

Posted: 11/20/2013 05:28 PM IST
Seemandhra ministers meet on jairam ramesh

సీమాంద్ర కేంద్ర మంత్రులకు కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడైన జైరామ్ రమేష్ భలే సలహా ఇచ్చారు. ఈరోజు సీమాంద్ర కేంద్ర మంత్రులు కొంతమంది జైరామ్ రమేష్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే జైరామ్ రమేష్ సీమాంద్ర మంత్రుల గోడు విని చివరకు చేతుల తిరగేసి, అమ్మ దగ్గర చెప్పుకోండని, ఉచిత సలహా ఇవ్వటం జరిగింది. ఈ సమావేశంలో కావూరి సాంబిశివరాలు, కోట్ల విజయభాస్కర రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.

 

సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని వారు కోరారు. ఇరుప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని చేసినందున ఒరిగేదేమీలేదని చెప్పారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం (యుటి) చేయాలని కోరారు. వారు చెప్పిన మాటలు విన్న తరువాత సోనియా గాంధీని కలమని జైరాం రమేష్ వారికి సూచించారు.

 

అసలు సీమాంద్ర కేంద్ర మంత్రులుగా సమైక్యాంద్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తాం అని చెప్పిన నాయకులే.. రహస్య భేటీలతో.. ప్యాకేజీలను అడుగుతుంటే.. ఇలాంటి అవమానలే జరుగుతాయని సమైక్యవాదులు అంటున్నారు. ప్యాకేజీలు మాని, సమైక్యం కోసం పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని సమైక్యవాదులు అంటున్నారు. అయిన అమ్మ దగ్గరకు వెళ్లి సమైక్యం అనే దైర్యం లేకనే..ఇలా ఎదురుపడిన ప్రతి నాయకుడి ముందు సీమాంద్ర కేంద్ర మంత్రులు గొంతు చించుకుంటున్నారు. ఏంత పెద్ద నాయకుడైన.. అమ్మ ముందు చిన్నవాడే కదా అనే విషయం సీమాంద్ర కేంద్ర మంత్రులు ఎలా మరిచిపోతున్నారో వారికే అర్థం కావాలని సమైక్య వాదులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles