Purandeswari talks on ap bifurcation

purandeswari talks on ap bifurcation, Daggubati Purandeswari , AP bifurcation, congress party,

purandeswari talks on ap bifurcation

ఎన్టీఆర్ కూతురు నమ్మకం?

Posted: 11/11/2013 02:40 PM IST
Purandeswari talks on ap bifurcation

సమైక్యాంద్ర పై ఎన్టీఆర్ కూతురు నమ్మకం. ఎన్టీఆర్ కూతురు అంటే .. కేంద్ర మంత్రిగా పదవిని అనుభవిస్తున్న డి. పురందేశ్వరి. ఇప్పుడు ఆమె సీమాంద్ర ప్రజలకు న్యాయం చేయటానికి కంకణం కట్టుకొని.. ఢిల్లీ పెద్దల చుట్టు తిరుగుతుంది. రాష్ట్ర విభజనకు సై అంటూనే.. మరో పక్క సీమాంద్ర ప్రజలకు న్యాయం చేస్తానని పురందేశ్వరి సీ మాంద్ర ప్రజలకు నమ్మమైన మాటలు చెబుతుంది.

 

సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ భరోసా ఇచ్చారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తామిప్పటికే జీవోఎంలో ఉన్న అందరు మంత్రులను వ్యక్తిగతంగా కలిశామని, సీమాంధ్ర ప్రజల మనోభావాలు తెలిపామని అన్నారు.

 

విభజన సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే వారికి న్యాయం జరుగుతుందో ప్రధానికి వివరించామని ఆమె వెల్లడించారు. సీమాంధ్ర ప్రజలకు అనుమానాలు ఉన్న నీరు, హైదరాబాద్, ఉద్యోగాలపై తమ అభిప్రాయాలు స్పష్టం చేసినట్టు ఆమె తెలిపారు.

 

తాము గతంలో జీవోఎంకు ఇచ్చినట్టే 11 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చామన్నారు. దీనిపై ప్రధాని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఇస్తామని తెలిపారన్నారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేస్తామని ప్రధాని చెప్పడంతో తమకూ నమ్మకం కుదిరిందని పురంధేశ్వరి అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles