తెలంగాణలోని 10 జిల్లాలకు సీమాంధ్ర జిల్లాలతో ఎలాంటి సరిహద్దు చిక్కులు, అడ్డంకులు లేవని తెలిపింది. ఆంధ్రతో విలీనం చేయడానికి ముందే హైదరాబాద్ దేశంలోనే ఐదో పెద్ద నగరమని, విలీనానికి ముందే నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని తెలిపింది.
విభజన తర్వాత తప్పని సరిగా రెండు హైకోర్టులు, రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లను, ఇద్దరు గవర్నర్లను ఏర్పాటు చేయాలని కోరింది. నాన్లోకల్ పోస్టుల స్థానంలో స్థానికులతోనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరింది. సచివాలయాన్ని రెండుగా చీల్చవద్దని, సీమాంద్రులకు కావాలంటే గచ్చిబౌలి కానీ డీఆర్కె భవన్ను కానీ కేటాయించాలని నివేదికలో పేర్కొన్నారు. 371-డి అధికరణను కొనసాగించడంపై విభజన తర్వాత ఉద్యోగులు, ఆ రాష్ట్ర ప్రజలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 6 పాయింట్ ఫార్ములా, గిర్గ్లానీ కమిషన్ ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం అక్రమంగా తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న 49వేల ఉద్యోగులను గుర్తించి వారి ప్రాంతాలకు పంపాలి అని టీజీవో డిమాండ్ చేసింది.
'ముల్కీ నిబంధనలు ప్రకారం కాకుండా జన్మ ద్రువీకరణపత్రాల ఆధారంగా తెలంగాణలో పుట్టని వాళ్లని వాళ్ల జిల్లాకే పంపండి. నాన్లోకల్, మల్టీజోన్ ద్వారా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న సీమాంద్రులను వెనక్కి పంపండి ' అని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీజీవో) జీవోఎంకు నివేదిక పంపింది.
శతాబ్దాల పాటు తెలంగాణ ప్రజల శ్రమతో నిర్మితమైన నగరాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట సీమాంద్రులు ఆక్రమించారని పేర్కొంది. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉమ్మడి రాజధానికి బదులు హైదరాబాద్ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా మార్చడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. ఇది తెలంగాణ ప్రజలకు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. భద్రాచలం, హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మూడు సంవత్సరాలు మాత్రమే అనుమతించాలని టీజీవో అధ్యక్షుడు వి. శ్రీనివాస్గౌడ్, ప్రధానకార్యదర్శి ఎలూరి శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more