వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారం ఇంకా మంత్రులను వెంటాడుతూనే ఉంది. పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై ఆయన, అనుచర గణం మొత్తం విడుదలయినా కానీ అప్పటి మంత్రులను మాత్రం సీబీబీ వదలడంలేదు. లేపాక్షి నాలెడ్జ్ హబ్పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో.. మంత్రి గీతారెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు, మాజీ మంత్రి ధర్మానకు కూడా కోర్టు సమన్లు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో విజయసాయి రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, బాలాజీలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గీతారెడ్డిని ఏ-9గా సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొని సమన్లు జారీ చేయడంతో మరోసారి ఆమె రాజీనామా వ్యవహారం తెర పైకి వచ్చింది.
నిజానికి సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిన రోజే .. ఆమె క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ను కలిసి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే.. అప్పుడే తొందర పడవద్దంటూ సీఎం ఆమెను బుజ్జగించారు. ఇప్పుడు సమన్లు జారీ చేసి, కోర్టు బోను ఎక్కాలని చెప్పడంతో గీతారెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. మరి ఈమె రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి ఆమోదిస్తారో ? లేక బుజ్జగిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more