సమైక్యాంధ్రలో ఉద్యమంలో జోరు పెరగడంలో ఎట్టకేలకు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రుల్లో కొంత మందికి కదలిక వచ్చింది. కొంత మంది మంత్రులు అధిష్టాన బుజ్జగింపులకు లొంగి రాజీనామా సమర్పించక పోగా, మరికొంత మంది అధిష్టానాన్ని దిక్కరించి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాజీనామాలు సమర్పించారు. గత కొన్ని రోజుల నుండి రాజీనామాలు చేయాలా ? వద్దా అంటూ డైలామా పడుతూ వచ్చిన కేంద్రమంత్రులు చిరంజీవి, పల్లంరాజు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పురంధరీశ్వరి తమ రాజీనామాలను ప్రధానికి సమర్పించి వాటిని ఆమోదించాలని కోరారు.
అదే ప్రాంతం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, రాజీనామాలు సమర్పించలేదు. నిన్న ప్రధానితో భేటీ అయిన మంత్రుల్లో వీరిద్దరు అక్కడే ఉన్నా రాజీనామాలు సమర్పించక పోవడం విశేషం. రాజీనామా ప్రసక్తే లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ఢిల్లీలో లేని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్చంద్ర దేవ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలంలు రాజీనామా ఊసే ఎత్తడం లేదు. రాజీనామాల సమర్పణ అనంతరం ప్రధానితో వీరి గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర విభజన విషయంలో మేం మోసపోయామని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారని, తక్షణం తమ రాజీనామాలను ఆమోదించాలని, ఇప్పటి నుండి విధులకు హాజరు కాబోమని చెప్పారు.
వీరి ఆవేదనను అంతా మౌనంగా విన్న ప్రధాని ‘తొందర పడి నిర్ణయాలు తీసుకోకండి ’ మీ సమస్యలు ఏవైనా ఉంటే మంత్రి వర్గ ఉప సంఘంతో చెప్పుకోండి ’ అని ఇంత చెబుతున్నా వినకుంటే ఇక మీష్టం అని ప్రధాని చల్లాగా చెప్పడంతో వారు అక్కడి లేచి వచ్చారు. తాము రాజీనామాలు సమర్పించాం కాబట్టి ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చిరు చెప్పాడు. కానీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం తీసుకోదని అన్నారు. వీరు ప్రజల్లోకి వెళితే ప్రజలు వీరిని రానిస్తారా ?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more