బీజేపీ ఎన్నికల రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వాంత్రత్య దినోత్సవ సంధర్భంగా జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడిన ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ని టార్గెట్ చేసి మాట్లాడు. స్వాంతంత్ర్య సభ వేధిక సాక్షిగా ఆయన ప్రధానికి దమ్ముంటే సుపరిపాలన, అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని ప్రధాని మన్మోహన్ సింగ్ను సవాలు చేశారు. యావద్దేశం తన ప్రసంగాన్ని ప్రధాని ప్రసంగంతో పోల్చి చూసుకుంటుందని నిన్ననే చెప్పిన మోడీ.. అనుకున్నట్లే తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్, చైనా ఎంత రెచ్చగొడుతున్నా భారతదేశం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ప్రధానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనీయులు మన భూభాగంలోకి వస్తున్నా మనం మాత్రం నోరు మెదపట్లేదని, ఇటాలియన్ సైనికులు వచ్చి మన మత్స్యకారులను చంపేసినా, పాకిస్థానీలు మనవాళ్ల తలలు నరుక్కెళ్లినా పట్టించుకోవట్లేదంటూ భుజ్ వేదికపై నిప్పులు కురిపించారు. దేశం మార్పు కోసం అవిశ్రాంతంగా ఎదురు చూస్తోందని ఆయన తెలిపారు. సుపరిపాలన, అభివృద్ధి అంశాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ప్రధానమంత్రిని మోడీ సవాలుచేశారు. 'మీరు పెద్ద దేశాన్ని పాలిస్తున్నారు, నేను చిన్న రాష్ట్రాన్ని పాలిస్తున్నా. అభివృద్ధి, సుపరిపాలన అంశాలపై ప్రధాని దమ్ముంటే చర్చకు రావాలి. ఢిల్లీ సర్కారుకు, గుజరాత్కు మధ్య పోటీ జరగాలి అని ఆయన అన్నారు. ఇప్పుడు మోడీ ప్రధాని పై చేసిన సవాల్ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more