గత కొన్నేళ్ళుగా తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తెలంగాణ ఏర్పాటు విషయం పై స్పష్టమైన ప్రకటన రావడానికి మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశం పై శరవేగంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర నేతలతో కోర్ కమిటీ భేటీ తరువాత నిర్ణయాన్ని సీడబ్ల్యూసీలో తేలుస్తామని అధిష్టానం మాటగా దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయం రానే వచ్చింది. రేపు సాయంత్రం కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తరువాత తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తుందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో చూస్తున్న తాజా పరిణామాలు కూడా స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నాయి. రేపు ప్రకటన అనంతరం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలను రాష్ట్రంలో, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో భారీగా మోహరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పారా మిలటరీ బలగాలను తరలించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అలాగే తిరుపతి, కడపలకు కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు తరలివె ళ్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో బలగాలను మోహరించకుండా సీమాంధ్రలో మోహరించడం పై ప్రకటన టి.కి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర బలగాలే కాకుండా కర్ణాటక నుండి కూడా 100 పారా మిలటరీ బలగాలను హైదరాబాద్ రప్పించారు. ఇప్పటికే అజిత్ సింగ్, శరద్ పవార్ తాము తెలంగాణాకు అనుకూలమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక మిగిలినవారితో కూడా చర్చించి స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఏది ఏమైనా తెలంగాణ ప్రకటన మరో 24 గంటల్లో వెలువడుతుందనే కథనాలు బలంగా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more