ఈరోజు హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ లోని బోట్ క్లబ్ లో లేజర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక క్రీడల మంత్రి వట్టి వసంత కుమార్ ఈ రోజు ప్రారంభించారు.
ఈ నెల 28 వరకు సాగే ఈ క్రీడలో దేశం నలుమూలల నుంచి 120 మంది ఔత్సాహికులు పాల్గొనబోతున్నారు. ఈ పోటీ 4.7 లేజర్ క్లాస్ బోట్లతో జరుగుతోంది. ఈ పోటీని లేజర్ క్లాస్ ఎసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
లేజర్ క్లాస్ ఒలింపిక్ క్రీడలలో ఒకటని, ఇది ఈ మధ్యకాలంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటోందని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన రియర్ కమోడోర్ బ్రిగేడియర్ రాజారామ్ ఈ సందర్భంగా తెలియజేసారు. లేజర్ సైలింగ్ కి హుస్సేన్ సాగర్ చాలా అనువైన స్థలమని చాలామంది కొనియాడారు.
ప్రభుత్వం తరఫునుంచి ఈ పోటీని సమీక్షించేందుకు నియమించబడ్డ కేప్టెన్ సోలి కంట్రాక్టర్, ఈ క్రీడలలో పాల్గొనటానికి యువతులు కూడా ముందుకొస్తున్నారని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more