పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి. ఎన్నికలే జరగలేదు పంచాయితీ ఫలితాలు రావడం ఏంటని అనుకోకండి. రాష్ట్రంలో ఉన్న పంచాయితీలలో 2623 పంచాతీల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మొత్తంగా చూస్తే అధికార పార్టీ తన అధికార అండతో ముందంజలో ఉండగా, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ కి ధీటుగా సత్తా చాటింది. కొన్ని జిల్లాల్లో వైకాపా తన హవా కొనసాగింది. తెలంగాణలో మాత్రం వైకాపా అంతంత మాత్రంగానే ప్రభావం చూపింది. రాష్ట్రం అంతటా కలిపి 2623 పంచాయతీలలో ఏకగ్రీవంగా సర్పంచ్ లు ఎన్నికైతే వాటిలో వాటిలో కాంగ్రెస్ 700, తెలుగుదేశం పార్టీ 570, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ -400, టిఆర్ఎస్ -88, మిగిలిన సిపిఐ ,సిపిఎం,బిజెపిలకు పది లోపే ప్రధాన పత్రికలు రాసిన కథనాల ఆధారంగా తెలుస్తుంది.
ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవ ఎన్నికలలో కాంగ్రెస్ మొదటి స్థానం, తెలుగు దేశం రెండో స్థానం, వైకాపా మూడో స్థానంలో ఉన్నాయి. కానీ సాక్షి దిన పత్రిక మాత్రం తనకు అనుకూలంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు 855, కాంగ్రెస్ -715, టిడిపి -421 పంచాయతీల స్థానాలు దక్కినట్లు రాసింది. పత్రికల కథనాలు ఎలా ఉన్నా, పార్టీలతో సంబంధం లేకుండా పలు జిల్లాల్లో పొత్తులు పెట్టుకుంటున్నట్లు సమాచారం. విశాఖ జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్,టిడిపి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పొత్తులు పెట్టుకుంటున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో టిడిపి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయని సమాచారం .చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ ,టిడిపిలు పొత్తు పెట్టుకుంటే, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పొత్తు కుదుర్చుకుంటున్నాయి. తెలంగాణ లోని నల్గొండలో తెలంగాణ ఐకాస 4 స్థానాలను గెలుచుకోవడం విశేషం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పలు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల ఫలితాలను బట్టే అసెంబ్లీ ఎన్నికల పై అంచనాకు వస్తాయి. కానీ పలు పార్టీలు కుమ్మక్కై ఇలా ఏకగ్రీవం కావడంతో ఏ పార్టీ పై ప్రజలు సుముఖంగా ఉందో తెలియక పలు పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more