Ap ias officers couple die road accident

visakhapatnam, jammu kashmir, IAS Officer Dharama Rao, Vidya rao

IAS couple, Dharama Rao and his wife Vidya rao, belong to Visakhapatnam in Andhrapradesh died in a road accident, occured in Jammu.

ఆంధ్ర ఐఏఎస్ దంపతులు దుర్మరణం

Posted: 06/14/2013 09:30 AM IST
Ap ias officers couple die road accident

విధి వెంటాడింది, వారి విహారయాత్ర జీవితంలో విషాదయాత్రగా మిగిలిపోయింది. మన రాష్ట్రానికి చెందిన మధ్యప్రదేశ్ కేడర్ కు  సీనియర్ ఐఏఎస్ అధికారి అయినధర్మారావు , ఆయన భార్య విద్యారావు జమ్ము కాశ్మీర్‌లోని లేహ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వేరొక వాహనంలో వారి వెంటే ప్రయాణిస్తున్న వారి ఇద్దరి కుమారులు ప్రతీక్ రావు, తన్మయ్ రావు సురక్షితంగా ఉన్నారు. విహార యాత్రలో ఉన్న వీరు జమ్ములోని ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఒక వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ వాహనంలోని వారంతా మరణించారు. టి.ధర్మారావు 1989 బ్యాచ్‌కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్ అధికారి.  చాలా కాలంగా మధ్యప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ధర్మారావు ఆంధ్రా యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐఎం చేసి, సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.  ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ పరిశ్రమల శాఖ కమిషనర్‌గా చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులు విశాఖలోని సీతమ్మధారలో ఉంటున్నారు. వీరి మరణవార్త విన్న బంధులువులు షాక్ తిన్నారు. ధర్మారావు దంపతుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో శుక్రవారం విశాఖ నగరానికి తరలించనున్నారు.  శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న తోటి అధికారులు దిగ్బాంతి వ్యక్యం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles