నిన్న రాత్రి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో యూపీఏ-2 వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ముఖ్యనేతలు, మంత్రులు, విపక్షాల నేతలు పాల్లొన్నారు. ఈ సందర్భంగా యూపీఏ-2 పాలన పై, 2012-13 ప్రగతి నివేధికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. యూపీఏ పాలనలో దేశం ఎంతో ముందుకు వెళ్లిందని అన్నారు. సోనియా గాంధీ మన్మోహన్ పాలలను మెచ్చుకున్నారు. ఇక ఈ సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి ఆంటోని మీడియాతో మాట్లాడుతూ... యూపీఏ ప్రభుత్వం ఇంత వరకు తెలంగాణ అంశం పై ఏ నిర్ణయం తీసుకోలేదేని అన్నారు. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రధాన మంత్రి పదవి రేసులో తాను లేనని, ఈ విషయం తాను ఎన్నో సార్లు చెప్పానని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ సమర్థుడని, చక్కగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. నాయకత్వాన్ని మార్చే ప్రసక్తి లేదని, ప్రధానికీ సోనియాకూ మధ్య విభేదాలు లేవని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఈ వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి కిరణ్ రాలేదు. ఇక గమనించదగిన విషయం ఏంటంటే... ఈ వేడుకలకు త్వరలో తెరాసలో చేరుతారన్న వార్తలు వస్తున్న టి.కాంగ్రెస్ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, జి. వివేక్ హాజరవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more