బెంగాల్ లో చిట్ ఫండ్ కుంభకోణంలో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 5 కి పెరిగింది. శారదా గ్రూప్ కూలిపోవటంతో దానిలోని చిట్ ఫండ్ విభాగంలో పనిచేస్తున్న ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే నలుగురు ఆత్మహత్య చేసుకోగా మరో ఏజెంట్ ముర్షిదాబాద్ జిల్లా సాలార్ వాసి 28 సంవత్సరాల ప్రతిమా దాస్ విషం తాగి చనిపోయింది.
డిపోజిటర్లు ఇచ్చిన సొమ్మును తిరిగి ఇచ్చే పరిస్థితి కనిపించకపోవటంతో ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె కుటుంబ సభ్యులు తెలియజేసారు. బురద్వాన్ జిల్లా కట్వాలోని చిట్ ఫండ్ కంపెనీ శాఖ కార్యాలయానికి వెళ్ళివచ్చిన పద్మ ముఖం చిన్నబోయివుందని, ఆమె వెళ్ళినప్పుడు ఆ కార్యాలయం తాళం వేసి వుండటం ఆమెకు మనస్తాపాన్ని కలిగించిందని కుటుంబసభ్యులు అన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని డిపాజిర్లు గత కొన్నిరోజులుగా ఆమెపై వత్తిడి తెస్తున్నారు. దానితో ఇటు డిపాజిటర్లకు సమాధానం చెప్పలేక, కంపెనీ నుంచి సొమ్ము రాబట్టలేక సతమవుతూ చనిపోయిన నలుగురు ఉద్యోగులతో పాటు పద్మ కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వేలాది మంది తమ కష్టార్జితాన్ని శారదా గ్రూప్ లో పెట్టుబడిగా పెట్టి అది ఒక్కసారిగా మునిగిపోవటంతో ఏజెంట్ల మీద వత్తిడి తెస్తున్నారు. చేసిన పని మీద చిన్నపాటి కమిషన్ కి ఆశపడి చేసిన పనే కానీ సంస్థమీద నియంత్రణ ఉండదు కాబట్టి ఏజెంట్లు ఏమీ పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నడిచినంత వరకూ బాగానే ఉంటుంది కానీ ఆగిపోయినప్పుడే ఇలాంటి స్కీమ్ లు అందరినీ ఇబ్బందిపెడతాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more