అమాంతం పెంచేసిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలవొగ్గే పరిస్థితి కనిపించుతుండటంతో పార్టీలు ఈ సమయంలో వెనక్కి తగ్గకుండా ఉంటేనే తాము ఈ పని చేయించినట్లవుతుంది, ఫలితం తమ ఖాతాలో పడుతుంది కాబట్టి పట్టు వదలకూడదనుకుంటున్నారు. అదే సందర్భంలో మా అంతట మేమే ఛార్జీలను తగ్గించాం కానీ ప్రతిపక్షాలు చెప్పబట్టి కాదని అనటం కోసం అధికారపక్షం నిర్ణయం తీసుకోవటానికి సరైన సమయంకోసం చూస్తున్నాయి.
ప్రజల నిరసనలకు ఒక మెట్టు దిగినట్టుగా ప్రభుత్వం నటిస్తున్నదే కానీ నిజం కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించటానికి పరిశీలిస్తానని అనటం ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యమని ఆయన ఆరోపించారు. పెంచిన ఛార్జీలు తగ్గించమని డిమాండ్ చేస్తున్నాం, తగ్గించాలి కానీ, పరిశీలించటమేమిటంటారాయన. అందువలన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 9 న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చారు.
సుందరయ్య విఙానకేంద్రంలో సమావేశమైన వామపక్షనేతలు రాష్ట్ర బంద్ విషయంలో చర్చిస్తున్నారు. ఈ నెల పిలుపునిస్తున్న బంద్ తో ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటాయని, బొగ్గు మాఫియా వలనే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, ఈ నిరసనల వలన ప్రభుత్వం దిగిరాక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
తెలంగాణా సమస్య ముదిరిపాకాన పడటానికి ఉన్న కారణాల్లో ఒకటి ఇలాంటి సమస్యే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వైపు మొగ్గు చూపిస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లా లేకపోతే తెరాస, ఇతర తెలంగాణా ఉద్యమకారుల పట్టుదల గెలిచినట్లా. ఓటర్ల దృష్టిలో అది ఎవరి ఖాతాలోకి వెళ్తుందన్నది ఒక కొరుకుడుపడని సమస్యగా మారింది. ప్రజా సమస్యలను పరిష్కరించాలి నిజమే కానీ ఆ పని ఎవరు చేసినట్లుగా ప్రజల గుర్తింపు వస్తుంది, రాజకీయ లబ్ధి ఏవిధంగా పొందుతాం అన్నవి పార్టీల్లో చర్చనీయాంశమౌతోంది. 2014 ఎన్నికలనే పెద్ద పరీక్షలు నెత్తిమీదకు వస్తుండటంతో రాజకీయ పార్టీలకు అవి తప్ప మరి దేనిమీదకూ ఆలోచనలు పోవటం లేదు, మరిదేనిమీదా ఆసక్తి కలగటం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more