ప్రముఖ వ్యాపారవేత్త, ఔషధ రంగంలో దిగ్గజం అంతర్జాతీయంగా పేరుగాంచిన రెడ్డి ల్యాబ్స్ సంస్థాపకుడు 72 సంవత్సరాల కె.అంజిరెడ్డి నిన్న హైద్రాబాద్ లో అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగాయి. అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి ఆయన చితికి నిప్పు అంటించారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, జైపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంత్రులు దానం నాగేందర్ రెడ్డి, సినీ నిర్మాత రామానాయుడు, అదనపు డిజి కృష్ణ ప్రసాద్, రెడ్డి ల్యాబ్స్ సిబ్బంది అంజిరెడ్డికి నివాళులర్పించారు.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కళ్ళం అంజిరెడ్డి, రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి, ఐడిపిఎల్ లో ఉద్యోగంతో మొదలు పెట్టిన ఆయన వృత్తిరేఖ అంచెలంచలుగా ముందుకు సాగింది. అందులో పెద్ద మలుపు 25 లక్షల రూపాయల పెట్టుబడితో 1984 లో ఆయన స్థాపించిన రెడ్డి ల్యాబ్స్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచి పలువురకు ఉపాధి కల్పించటమే కాకుండా భారతావనికి జీవనదాతగా రూపొందింది. ప్రాణాలను నిలిపే ఖరీదైన ఔషధాలను భారత్ లోనే తయారుచెయ్యటం కోసం నిరంతర పరిశోధనతో రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో జెనెరిక్ రూపాలను రూపొందించి అనేక ఔషధాలకు (బల్క్ డ్రగ్స్ కి) పేటెంట్లను సంపాదించారు. దానితో భారతదేశ వాసులకు జీవన ప్రదాత అయ్యారు అంజిరెడ్డి. వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కి చేరుకున్న రెడ్డి ల్యాబ్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైన మొదటి ఆసియా కంపెనీగా ఖ్యాతిగాంచింది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పసుపు రైతు కుటుంబంలో జన్మించిన అంజిరెడ్డి వీధిబడిలో చదువుకుని, ప్రపంచ ఖ్యాతిని గడించే బహుళ జాతి సంస్థను స్థాపించే స్థితికి ఎదిగారంటే దీని వెనుక ఆయన దూరదృష్టి, కృషి, పట్టుదల ఎంత ఉన్నాయో ఊహించుకోవచ్చు. ప్రపంచంలో ఔషధ సంస్థల్లో అగ్రగామైన ఫైజర్ ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మించిపోయే లక్ష్యం వైపు గా అడుగులు వేసి సాధించిన అంజిరెడ్డి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ బిరుదుతో సత్కరించింది.
ఆయన భార్య సామ్రాజ్యం, కుమార్తె అనూరాధ, కుమారుడు సతీష్ రెడ్డి ఉన్నారు. కొన్నాళ్ళుగా వ్యాపారంలో చురుగ్గా పాల్గొనలేకుండా ఉన్న కారణంగా కుమారుడు సతీష్ రెడ్డి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గానూ, అల్లుడు జివి ప్రసాద్ వైస్ ఛైర్మన్ గానూ ఆయనకు తోడుగా పనిచేస్తూ వస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more