అనుకున్న ప్రకారం పాకిస్తాన్ ప్రధానమంత్రికి జయ్ పూర్ లో భారత్ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్వాగతం పలికారు. భోజనానికి వెళ్ళటానికి ముందు పలకరించుకుని పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఆయన పిలుపు రాబట్టే మీరు వచ్చారంటూ పాక్ ప్రధాని రజా పర్వేజ్ అష్రఫ్ తో ఖుర్షీద్ అన్నారు. 13 వ శతాబ్దానికి చెందిన ప్రాచీనం, ప్రాముఖ్యతను సంతరించుకున్న సూఫీ సంత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ ఛిస్టీ దర్గాని దర్శించుకోవాలంటే ఖ్వాజా దివ్య సంకేతం అందితేనే అది సాధ్యమనే నమ్మకం అందరిలోనూ ఉంది కాబట్టి ఖుర్షీద్ ఆ ఖ్వాజా పిలుపు రాబట్టే మీరు వచ్చారంటూ అష్రఫ్ తో అన్నారు.
తరువాతి కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి-
జయ్ పూర్ రామ్ బాగ్ ప్యాలెస్ హోటల్లో, రాజస్తానీ ప్రత్యేక వంటకాలను వడ్డిస్తారు. అందులో దాల్ భాటీ కుర్మా, మేథీ సబ్జీలాంటి విశేష వంటకాలతోపాటు లాల్ మాస్ అనే ఎర్ర మాంసంతో చేసిన మాంసాహార వంటకాన్ని కూడా ఈ రోజు విశేష అతిథికి వడ్డించే మెనూలో చేర్చారు. మిఠాయి రసమలాయ్ తో ముగింపు ఉంటుంది.
ఆ తర్వాత 3.30 కి హెలికాప్టర్ లో అజ్మేర్ కి 12 కి.మీ దూరం ఉన్న ఘుఘరా హెలిపాడ్ మీద దిగి అజ్మేర్ దర్గాకి రోడ్డు ప్రయాణం చేస్తారు. దర్గా కమిటీ సభ్యులు, ఖాదిమ్ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి, బులంద్ దర్వాజా ద్వారా ప్రధాన దర్గా లోకి తీసుకెళ్తారు. అక్కడ నగారాలు వాయిస్తారు, అక్కడి ఆచారం ప్రకారం తలపాగ కట్టే వేడుకను పూర్తి చేస్తారు. జియారత్ అయిపోయిన తర్వాత అష్రప్ బృందం తిరిగి హెలికాప్టర్ లో జయ్ పూర్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పాకిస్తాన్ వెళ్ళిపోతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more