ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ దర్యాప్తులో ప్రగతి ఇలా ఉంది.
ఢిల్లీ తిహార్ జైలునుంచి తీసుకుని వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు సయ్యద్ మఖ్బూల్ ఇమ్రాన్ ఖాన్ ల గడువు తీరిపోవటంతో వాళ్ళని ఈ నెల 13 వరకూ జుడిషల్ కస్టడీకి తరలించారు. వీళ్ళద్దరినీ హైద్రాబాద్ తీసుకుని వచ్చి ఘటనా స్థలికి తీసుకుని పోయి ప్రశ్నించిన మీదట కొంత భోగట్టా లభించిందని తెలిసింది. ఢిల్లీ తిహార్ జైలునుంచి తీసుకుని వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు సయ్యద్ మఖ్బూల్ ఇమ్రాన్ ఖాన్ ల గడువు తీరిపోవటంతో వాళ్ళని ఈ నెల 13 వరకూ జుడిషల్ కస్టడీకి తరలించారు. వీళ్ళద్దరినీ హైద్రాబాద్ తీసుకుని వచ్చి ఘటనా స్థలికి తీసుకుని పోయి ప్రశ్నించిన మీదట కొంత భోగట్టా లభించిందని తెలిసింది. అయితే ఆ సమయంలో మఖ్బూల్ ముఖంలో భయం కానీ, పశ్చాత్తాపం కానీ లేకుండా చిరునవ్వుతో ధీమాగా రెండు మూడు నెలల్లో బయటకు రానూ అంటూ గర్వంగా చెప్పాడు. పోయిన సంవత్సరం జూలై నెలలో మఖ్బూల్, ఇమ్రాన్ ఖాన్ లు దిల్ సుఖ్ నగర్ లో పర్యటించారని జాతీయ దర్యప్తు సంస్థ తెలియజేస్తోంది. పోయిన సంవత్సరం జూలై నెలలో మఖ్బూల్, ఇమ్రాన్ ఖాన్ లు దిల్ సుఖ్ నగర్ లో పర్యటించారని జాతీయ దర్యప్తు సంస్థ తెలియజేస్తోంది.
జాతీయ నిఘా సంస్థ ఇచ్చిన నివేదిక మీద ఢిల్లీ లోని ఎన్ఐఏ న్యాయాలయం ఇండియన్ ముజాహిదీన్ సంస్థాపకుడు రియాజ్ భక్తల్ మరి తొమ్మిది మంది అనుచరులకు నాన్ బెయిలబుల్ వారంట్లను జారీచేసారు. ఈ కేసుని విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం బయటివారిని అనుమతించకుండా న్యాయస్థానంలోపల జరిపిన విచారణ అనంతరం భక్తల్ తో పాటు మోహ్సిమ్ చౌధరి, అమిర్ రిజాఖాన్, షా నవాజ్ ఆలమ్, అసదుల్లా అఖ్తర్, ఆరిజ్ ఖాన్, మొ.ఖాలిద్, మిర్జా షాదాబ్ బేగ్, మొ.సాజిద్ లకు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది.
ఈ కేసులో మరో కరడుగట్టిన ఉగ్రవాది ఒబైద్ ఉర్ రెహమాన్ ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్నాడు. ఇండియన్ ముజాహిదీన్ కి చెందిన ఇతని మీద కూడా వారంట్ జారీ చేసి దర్యాప్తుకోసం అప్పగించమని దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more