సామాజిక కేంద్రానికి కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి విష్ణుతో పాటు మరో 11 మంది పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విశాఫ పట్నంలోని మువ్వలవానిపాలేంలో 4, 114 చదరపు గజాల స్థలాన్ని వుడా సామాజిక కేంద్రం కోసం కేటాయించింది. విష్టు 2001 లో వూడా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని 21 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. దీనిపై శ్రీ బాలజీ పార్కు నివాసితులు హై కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం వుడా అక్రమ కేటాయింపుల్ని తప్పబట్టింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వుడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రింలోనూ వుడాకు చుక్కెదురైంది. ఈ క్రమంలో కేసు మళ్లీ హైకోర్టుకు చేరగా.. అక్రమ కేటాయింపులపై న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన సీబీఐ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. ఎవరూ ఫిర్యాదు చేయకుండా చర్యలు ఎలా తీసుకుంటామని సీఐడీ అడిగింది. దీంతో ఐఏఎస్ అధికారి విష్ణుతో పాటు అక్రమాలతో సంబంధం ఉన్నవారిపై సీఐడీ కి ఫిర్యాదు చేయాలని అప్పటి వుడా ఉపాధ్యక్షుడిని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో పని చేసిన అధికారి ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేశారు. తాజాగా వుడా ఉపాధ్యక్షుడు యువరాజ్ హైదరాబాద్ వచ్చి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు మోసం, కుట్ర ఫోర్జరీలతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద విష్ణుతో పాటు మరో 11 మంది పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతలు డీఎస్సీ వెంకటనారాయణకు అప్పగించారు. విష్ణుతో పాటు మిగతా 11 మందిని విచారించి వాంగ్మూలన్ని నమోదు చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more