తమిళ పులి ప్రభాకరన్ కొడుకు 12 సంవత్సరాల బాలచంద్రన్ ని సైనికులు చంపారన్నది నిజం కాదు అన్నారు శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సా నిన్న మీడియాతో మాట్లాడుతూ. అలా జరిగుంటే నాకు తెలిసుండేది. నా దృష్టికి తప్పకుండా వచ్చుండేది. నా సైనికులే ఆ పని చేసినట్లయితే దాని పూర్తి బాధ్యత నాదే అవుతుంది అంటారు రాజపక్సా.
అదంతా మీడియా సృష్టి. 2009 లో యుద్ధాంతంలో జరిగిన తప్పిదంగా పేర్కొంటున్న అంతర్జాతీయ సంస్థలు, మీడియా తప్పంటూ వేలెత్తి చూపిస్తున్నాయంటే వాళ్ళ పని అంతే, అలాగే వుంటుంది. శ్రీలంకలోని ఒక వర్గంతో అది కూడా ప్రతిపక్షంతో మాట్లాడి, ఒక పక్క నుంచే నిజాన్ని నిర్ధారిస్తానంటే అది సరైన పద్ధతి కాదు. తద్వారా ప్రపంచ దేశాల మద్దతుని తీసుకుందామనుకుంటున్నాయి. అలాంటి వత్తిడులు శ్రీలంకలో పనిచెయ్యవు అన్నారు రాజపక్సా.
ఈ విషయంలో మానవ హక్కులను ఉల్లంఘించారంటూ భారత విదేశాంగ శాఖామాత్యులు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యానాలను ఆయన తప్పు పట్టారు. ఇక్కడ మాకూ చట్టాలున్నాయి, వాటికి అనుగుణంగానే మేమూ ప్రవర్తిస్తాం. ఇప్పటికి 14000 మంది ఎల్ టి టి ఇ సభ్యులను జైళ్ళ నుంచి విడుదల చేసాం. వాళ్ళ మీద హత్యల నుంచి ఎన్నో కేసులున్నాయి. వాళ్ళందరి మీదా కేసులు పెడితే వాళ్ళ గతేమవుతుంది. కానీ నేను బౌద్ధమతాన్ని అనుసరించేవాడిన. నాలో ప్రేమ సహనాలు ఉన్నాయి. ఇంకా ఎల్ టి టి ఇ ఖైదీలున్నారు. వారిని కూడా విడుదల చెయ్యటానికి మార్గాలను వెదుకుతున్నాం అన్నారాయన.
భారత్ తో మా సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎంతో మంది మత్స్య కారులు మా దేశానికి సంబంధించిన జలాలోకి ప్రవేశిస్తుంటారు. అయినా వారిని మేము వదిలిపెట్టేస్తుంటాం. తమిళనాడులో శ్రీలంక నుంచి వెళ్ళిన యాత్రికులను తిప్పి పంపించేసారు. అయినా మేము ఎప్పుడూ శ్రీలంకలోని భారతీయులను పట్ల ద్వేషం చూపించిన ఉదంతాలేమీ లేవు అన్నారు రాజపక్సా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more