ఇప్పుడు టాలీవుడ్ వణికి పోతుంది. వరుస ఏసిబీ దాడులతో చిత్ర పరిశ్రమలో అలజడి మొదలైంది. భారీ చిత్రల నిర్మతల పై వరుస ఏసీబీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకేసారి దిల్ రాజ్, డి.వి దానయ్య ఇళ్లపై దాడులు చేసి టాలీవుడ్ నిర్మాతలకు షాకిచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి ఎదుగుతున్న బండ్ల గణేశ్ పై ఇంటి పై ఏసీబీ దాడులు చేసి, కొన్ని విలువైన డ్యాకుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే బండ్ల గణేశ్ వెనుక ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారనే అనే అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిన్న నటుడిగా ఉండి ఆకస్మికంగా పెద్ద నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేశ్ ఎవరి బినామీనో ఆదాయపు పన్ను శాఖ అధికారులు లోతుగా విచారణ జరపాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. గణేశ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదా చేసిన నేపథ్యంలో ఆయనీ విషయాలు ప్రస్తావించారు.
'గణేశ్ కోటీశ్వరుడిగా పుట్టలేదు. కానీ కోట్ల రూపాయలతో గబ్బర్సింగ్ లాంటి భారీ సినిమాలు తీస్తున్నారు. ఆయన ఎన్ని సినిమాలు తీశారు? అందుకు ఎంత వ్యయం చేశారు? ఆ డబ్బు ఎక్కడనుంచి వచ్చింది? అన్నది అధికారులు విచారణ జరపాలి. ఆయన వద్ద పీసీసీ చీఫ్ బొత్స డబ్బుందా? లేక మరెవరిదైనా ఉందా? అన్నది కూడా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక బొత్స ఉన్నారా? లేక గబ్బర్సింగ్ సినిమా తీశారు కాబట్టి పవన్ కల్యాణ్ లేదా ఆయన అన్న చిరంజీవి ఉన్నారా అన్నది కూడా తేలాలి. విషయాలు బయటకు రాకుండా ఆ శాఖపై ఒత్తిడి వస్తోంది. తననెవరూ ఏమీ చేయలేరని, ఏం చేసినా కాపాడేవాళ్లు ఉన్నారని బహిరంగ సభల్లోనే గణేశ్ చెప్పారు. తాను హత్య చేసి వెళ్లినా బొత్స తనను కాపాడతారంటూ బాహాటంగానే చెప్పారు. అంతలా కాపాడే సంబంధాలు ఏమిటి? వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి' అని ఆయన అన్నారు. గణేశ్ ఫలానా వారికి బినామీ అని తాను చెప్పడం లేదని, ఎవరికి బినామీనో తేల్చాలని ప్రభుత్వాన్నే తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more