విద్యార్థులు హైటెక్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. బెంగళూరు లో ముగ్గుర ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు హైటెక్ కాపియింగ్ పాల్పడినట్లు సమాచారం. రాజీవ్ గాంధీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం లో ముగ్గురు విద్యార్థులు హైటెక్ కాపియింగ్ చేస్తూ దొరికిపోయారు. వారిని ఆ వైద్యశాల డిబార్ చేసింది. డిసెంబర్ 19న జరిగిన హైటెక్ కాపియింగ్ విషయాన్ని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అశోక్ కుమార్ వెల్లడించారు. దీనిపై విచారణకు ఉన్నత స్థాయి సమితి ఏర్పాటు చేశారు. నివేదిక వచ్చిన తరువాత ముగ్గురిని శాశ్వతంగా కోర్సుకు అనర్హుల్ని చేస్తామని తెలిపారు. ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 19 నుండి 30 వరకు జరిగాయి. ఓ పరీక్ష కేంద్రంలో ముగ్గురు విద్యార్ధులు హైటెక్ కాపియింగ్ పాల్పడుతున్నట్లు అధ్యాపకులతో పాటు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పరీక్ష కేంద్రంలో కూర్చున్న ముగ్గురు విద్యార్థులు , బ్లూ టూత్, పెన్ స్కానర్ల ద్వారా ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి యూట్యూట్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న మిత్రులకు పంపించారు. అక్కడి నుంచి జవాబులు తీసుకోసాగారు. సరైన సమాధానాలు రాకపోవడంతో విసుగు చెందారు. పదే పదే చొక్కాను సవరించుకుంటూ, మాట్లాడుతూ కనిపించారు. ఆ గదిలో ఉన్న ఆరుగురు పరిశీలకులు వీరిపై కన్నేశారు. సీసీ కెమెరాల చిత్రాలను మరో గదిలోని పరిశీలకులు గమనించసాగారు. ముగ్గురి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎక్కడా కాపీలు కనబడలేదు. అనుమానంతో పక్క గదిలోకి తీసుకువెళ్లి చొక్కాలు విప్పించారు. రాసే పెన్నుల్ని స్వాధీనం చేసుకున్నారు. చొక్క కాలర్ కింద ఉన్న మైక్, ఇయర్ ఫోన్లు కాలర్ మధ్యలో నెట్ కు సమాచారం పంపించే పరికరం ఉన్నట్లు తేలింది. సాంకేతిక నిపుణుల చేత పరీక్ష చేయించగా హైటెక్ కాపియింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ ముగ్గురు కర్ణాటకవారేనని చెప్పారు. అయితే విద్యార్థుల పేర్లు మాత్రం డాక్టర్ అశోక్ కుమార్ బయట పెట్టలేదు? తర్వలో వారి పేర్లు , ఇతర వివరాలను వెల్లడిస్తామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more