భారత యువతకు హెచ్చరికలాంటి ఒక నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) విడుదల చేసింది. జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020 నాటికి భారత్లో మరణాలకు గుండెజబ్బులే ఎక్కువగా కారణమవుతాయట."గతంలో పెద్దవారికి మాత్రమే గుండెజబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసువారూ గుండె సంబంధిత వ్యాధులతో మా దగ్గరకు వస్తున్నారు.'' అని ప్రముఖ వైద్యులు నీరజ్ భల్లా వ్యాఖ్యానించారు. మరో ఐదు, పదేళ్లలో 20 శాతం భారత ప్రజలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడతారని డబ్ల్యూహెచ్వో తెలిపింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులే అందుకు ప్రధాన కారణమట."పొగత్రాగడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం ఈనాటి యువతకు చెడు అలవాట్లుగా మారాయి.
పని ఒత్తిడి తట్టుకోలేక నేటి యువత తాగుడుకు, పొగతాగడానికి బానిసలవుతున్నారు. దీంతో పరిస్థితి మరింత విషమిస్తోంది'' అని ప్రముఖ వైద్యులు కమల్దీప్ సింగ్ వెల్లడించారు. వ్యాయామం చేయడం, జంక్, ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండటం, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను మానుకోవడం ద్వారా గుండెజబ్బులు రాకుండా నివారించవచ్చని తెలిపారు. "ఒత్తిడి నేటి జీవన విధానంలో భాగమైపోయింది. దాన్ని మనం దూరంగా పెట్టలేం. కానీ ప్రతీరోజు ఒక అరగంట వ్యాయామం లేదా నడక మంచి ఫలితాలు ఇస్తుంది'' అని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు సెప్టెంబర్ 29వ తేదీని వరల్డ్ హార్ట్ డేగా పాటిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది కోటి 73 లక్షల మంది గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారు. 2030 నాటికి ఆ సంఖ్య 2 కోట్ల 30 లక్షలకు చేరుతుందని అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more