కరెంట్ సంక్షోభానికి పొదుపే మంత్రం అంటూ ప్రజలకు సుద్దులు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం...తనదాకా వచ్చేసరికి జాన్తా నై అంటోంది. కోట్లు పెట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ విమానాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది.కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక జనం గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఒక్కొటొక్కటిగా మూత బడుతున్నాయి. కళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు నిలువుగా కుంగిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్న ప్రభుత్వం...కరెంట్ సంక్షోభానికి పొదుపే మంత్రం అంటోంది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం...ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాష్ట్ర ఖజానాపై కోట్ల రూపాయల భారం మోపేందుకు అంతా సిద్ధం చేసింది. ఆయనకోసం కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేయాలని డిసైడైపోయింది.
నిజానికి అంతకుముందు ఏకంగా 100 కోట్లకు పైగా ఖరీదయ్యే కొత్త విమానాన్ని సిఎం కోసం కొందామనుకుంది. అయితే అది ఖరీదైన వ్యవహారం కావడంతో వెనుకంజ వేసింది. విమాన, సిబ్బంది ఖర్చులను భరించడం తమ వల్ల కాదని అనుకుంది. అందుకే ఇప్పుడు లీజు కింద ఆయనకు విమానాన్ని సమకూర్చబోతోంది. అదే జరిగితే రాష్ట్ర ఖజానాకు దాదాపు 14 కోట్ల రూపాయల భారం పడుతుంది. రాష్ట్ర ఆధీనంలో వున్న విమానం ఏడాది మెయింటెనెన్స్ కంటే ఇది ఎక్కువ. ఇందిరమ్మ బాటలో భాగంగా రాష్ట్రమంతటా కొనసాగే సిఎం పర్యటనను దృష్టిలో వుంచుకుని విమానాన్ని లీజుకు తీసుకుందామని నిర్ణయించామని, దాన్ని నెలకు 30 నుంచి 40 గంటలపాటు ఉపయోగిస్తామని ఒక సీనియర్ అధికారి చెప్పారు. అయితే లీజుకు తీసుకున్నా రాష్ట్ర ఖజానాపై భారం పడక తప్పదు. ఎందుకంటే...నియమనిబంధనల ప్రకారం విమానం ఎంత చిన్నదైనా ఇద్దరు పైలెట్లు, ఒక ఆపరేషన్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్, ఫ్లయిట్ డిస్పాచర్, ఒక క్యాబిన్ అటెండెంట్ వుండి తీరాలి. అదీ సిఎం విమానం సంగతి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more