Cm tour in west godavari

cm tour in west godavari

cm tour in west godavari

7.gif

Posted: 08/19/2012 01:51 PM IST
Cm tour in west godavari

        పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట ఏర్పాట్లలో అప్రశుతి చోటు చేసుకుంది. సీఎం ప్రసంగం కోసం నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌండ్ సిస్టమ్ పరిశీలిస్తున్న ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
      cm_west ఇదిలా ఉండగా సీఎం ఇందిరమ్మబాట పశ్చిమగోదావరి జిల్లాలో యమజోరుగా సాగింది.  పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, తణుకు, ఆచంట నియోజకవర్గాల్లో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వృధాగా పోతున్న 400 టీఎంసీల మంచినీటి వ్యవసాయ, విద్యుత్ అవసరాల కోసం వినియోగించుకోవచ్చ అన్నారు. వ్యవసాయ రంగ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై రైతులకు భారీ సబ్సీడీలు ఇస్తున్నామని చెప్పారు. తాడేపల్లి గూడెంలో ముఖ్యమంత్రి రైతులు, ఉద్యాన యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు.
 
    దీంతో పాటు తన సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రజలకు తెలియజేశారు. ఏడాదిలో లక్షా 20వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. అనంతరం తాడేపల్లిగూడెం, తణుకు ఫ్లై ఓవర్లను సీఎం  ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలో అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రారంభించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna son mokshajna drunk and drive
Cheating in the name of cm brother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles