168 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించడం ద్వారా చిత్తూరు జిల్లా నారాయణవనం సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గతంలో ఈ సుదీర్ఘ ప్రసంగం రికార్డు మెక్సికోవాసుల పేరిట ఉంది. 2004లో అక్కడ 636 మంది ఒక్కొక్కరు 5 నిమిషాల చొప్పున ఐదు భాషల్లో 100 గంటలపాటు ప్రసంగించి రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం సిద్ధార్థ విద్యార్థులు ఆ రికార్డును అధిగమించారు. గత సోమవారం 14 మంది సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు 168 గంటల సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిన్న సోమవారం మధ్యాహ్నం 12 గంటల 12 నిముషాల 12 సెకండ్లకు ముగించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన ‘అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్’ ప్రతినిధి రాజేంద్రన్ మాట్లాడుతూ.. ‘14 మంది విద్యార్థులు 168 గంటల పాటు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయడం సరికొత్త ప్రపంచ రికార్డు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు సిఫారసు చేస్తాం’ అని తెలిపారు. రికార్డు యత్నంలో పాల్గొన్న విద్యార్థులు రాజన్, దీప్తిచైతన్య, భానుప్రియ, యశస్విని, శ్రుతి, నేతాజీ, శ్రీనాథ్, రాహుల్తేజ, షణ్ముగశ్రీనివాసులు, నిఖిల్కుమార్, శ్రీవాస్తవ్, నాగశ్రీ, రమ్యకృష్ణ, రాజశీలన్లకు ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మురళి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more