కాశ్మీరీ యువతులకు కొత్త ఆపద ముంచుకొచ్చింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ ఒకటి అక్కడి అమ్మాయిలపై కత్తికట్టింది. ఆడపిల్లలెవరైనా బురఖా ధరించకుండా బయటకు వస్తే వారిపై యాసిడ్ పోసి చంపేస్తామని లష్కర్ అల్ కాయిదా అనే కొత్త ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఆడపిల్లలెవరైనా సెల్ ఫోన్స్లో మాట్లాడుతూ కనిపించినా వారిని కాల్చి చంపుతామంటూ ప్రకటించింది. దక్షిణ కాశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో పలు ప్రాంతాలలో ఈ హెచ్చరికలతో కూడిన పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 'బురఖాలు ధరించకుండా ఆడ పిల్లలను బయటకు పంపవద్దని ప్రజలను కోరుతున్నాం. మా హెచ్చరికలను ధిక్కరించి ఎవరైనా బురఖా లేకుండా బయట తిరిగితే వారిపై యాసిడ్ దాడులు చేస్తాం. చంపేస్తాం' అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ కనిపించిన అమ్మాయిలను కూడా అక్కడికక్కడే కాల్చి పారేస్తాం అని కూడా హెచ్చరికలు చేశారు. అలాగే, పంచాయతీల సర్పంచ్లకు అల్టిమేటం జారీ చేశారు. మసీదులకు వెళ్లి తాము చేసిన తప్పులను బహిరంగంగా ఒప్పుకొని స్వచ్ఛందంగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారిని కూడా హతమారుస్తామని ప్రకటించారు. 'సర్పంచులంతా తమ పదవులకు రాజీనామాలు చేసి వాటిని మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవాలి. అలాగే, రాజీనామా పత్రాలను తమవెంట ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు అడిగితే దానిని చూపించాలి. లేకుంటే వారి భరతం పడతాం' అని ఆ ఉగ్రవాద సంస్థ భయాందోళనలు గొలిపే ప్రకటనలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more