సర్కారీ కొలువులు పొందాలనుకునే యువకులకు ప్రస్తుత కాలంలో పలు అవకాశాలు తలుపుతడుతున్నాయి. పక్కా ప్రణాళికతో తర్పీదు పొందిన వారకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెగ్గుకురావటం తలకుమించిన భారం కూడా కాదు. తాజాగా గ్రూప్-4 జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈనెల 11న నిర్వహించనున్న రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 1,486 పోస్టులకుగానూ 9,58,333 మంది దరఖాస్తు చేసుకున్నారని, రాత పరీక్షకు 2,629 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని ఆమె చెప్పారు. పేపర్-1ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు ఉంటుందని తెలిపారు. 11వ తేదీ ఉదయం 9 గంటల వరకు అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని
వివరించారు. ఒక జిల్లా విద్యార్థి ఇంకో జిల్లాలో పరీక్ష రాసిన సందర్భంలో.. ఆ అభ్యర్థి హాల్టికెట్లో సూచించిన పరీక్ష కేంద్రంలోనే పరీక్ష రాసే అవకాశం కల్పించామని మాలకొండయ్య చెప్పారు. అయితే, గ్రూప్-4 జిల్లా యూనిట్ అయినందున.. లోకల్ అభ్యర్థిగా పరిగణించాలంటే.. పరీక్ష హాల్లో నామినల్ రోల్ వద్ద సొంత జిల్లాను రాయాలని.. నాన్ లోకల్గా పరిగణించాలనుకుంటే పరీక్ష రాస్తున్న జిల్లాను పేర్కొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో వైట్నర్ వాడటానికి వీలు లేదని, అలా వాడితే ఓఎంఆర్ షీట్ను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.
ఇంకా, త్వరలో కొత్త నోటిఫికేషన్లు: 107 చైల్డ్ డెవలప్మెంట్ అధికారి, 377 ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏఈ, డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడుతాయని పూనం మాలకొండయ్య తెలిపారు. గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పది పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించిందని, వీటిని కొత్తగా గ్రూప్-2 ద్వారా భర్తీచేస్తామని తెలిపారు. వార్షిక క్యాలెండర్కు ఇంకా ఆమోదం రావాల్సి ఉందన్నారు. ఈ వార్షిక క్యాలండర్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఖాళీ అయ్యే పోస్టులను అన్ని శాఖలు ఆర్థిక శాఖకు పంపితే.. వాటి భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చే ప్రక్రియ జనవరి మాసంలో పూర్తవుతుందని ఆమె స్పష్టం చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more