అనేక కుంభకోణాల్లో మంత్రులకు ప్రమేయం ఉందని ఒక మంత్రి అరెస్టు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారని అన్నారు. హత్యారాజకీయాలు , హత్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ధనాన్ని దోచుకుందని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ 89వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బాబు మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ఇంత కాలం తాము జరిపిన పోరాటం ఫలితంగానే సిబిఐ విచారణ, కేసులు, అరెస్టులు జరిగాయని తెలిపారు.
వైఎస్ఆర్ అవినీతిపై తాము మొదటి నుంచి ఉద్యమిస్తూనే ఉన్నామన్నారు. తాము వ్యక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించడం లేదని, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్, జగన్ కుమ్మక్కు అయి ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంతో కుమ్మక్కు కావలసిన ఖర్మ మాకు పట్టలేదని అన్నారు. వైఎస్ విజయమ్మ మాటల్లో వాస్తవం లేదని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర సంపదను, కాపాడాం కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుందని అన్నారు. కాంగ్రెస్ అవినీతి వల్ల అధికారులు, పారిశ్రామిక వేత్తలు సైతం అరెస్టవుతున్నారని అన్నారు. అవినీతి పరులందరినీ శిక్షించాల్సిందేనని అన్నారు. పదే పదే ఉప ఎన్నికల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. త్యాగాల పేరుతో రాజీనామా చేసిన వాళ్లు తిరిగి పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే విధంగా ఎన్నికల సంస్కరణలు రావాలని అన్నారు. వసూల్ రాజా, కరప్షన్ రాజాలు డబ్బుల కోసమే పదే పదే ఎన్నికలు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి కోసం టిడిపిని ఏర్పాటు చేశారని, పేదల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more