‘వేదం’ సినిమాలో అనుష్క నటించిన పాట ఒకటి గుర్తుకు వస్తుంది. ‘‘ఎగిరిపోతే ఎంతబాగుంటుందో’’ అనే పాటలో అనుష్క బాగా నటించింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పాట పాడుకుంటు గాంధీభవన్ తిరుగుతున్నారట. కొంతమంది నాయకులు మాత్రమే ..ఈ పాటను పాడుతున్నారట. ఈ పాట విన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుండెల్లో గుబులు పుడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు . అంటే మిగత నాయకులు ఎప్పుడు ఎగిరిపోతారో అనే భయం కిరణ్ మనస్సులో ఉందని .. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు . ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బొబ్బిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగారావు, విశాఖ జిల్లా నుంచి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రి కూడా జగన్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొబ్బిలి నుంచి ఎమ్మెల్యే రంగారావు హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, టీడీపీల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత మైసురారెడ్డి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా జగన్తో శుక్రవారం దిల్కుషా అతిథి గృహనికి వచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more