సీల్ లోనూ అమ్మాయిలే తమ హవా చూపించారు. పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీప్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 2న జరిగిన 'సీప్'కు రాష్ట్రవ్యాప్తంగా 2,28,352 మంది హాజరుకాగా వీరిలో 1,84,778 మంది.. అంటే 80.92 % విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. ర్యాంకులు మాత్రం బాలురకే వచ్చా యి. బాలికల్లో 85.28% మంది, బాలురలో 79.37% మంది ఉత్తీర్ణులయ్యారు. సీప్లో ఈ సారి ముగ్గురికి ఫస్ట్ ర్యాంకులు లభించాయి. పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహించగా.. 118 మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు..
గన్ని సూర్య తేజ (తూర్పుగోదావరి), గుబ్బల సాయిచంద్(పశ్చిమ గోదావరి), సత్తి రూపశ్రీ హరీందర్రెడ్డి (పశ్చిమగోదావరి) ప్రథమస్థానంలో నిలిచారు. రాష్ట్రంలో మొదటి పదీ బాలురకే వచ్చాయి.
సీప్ ఫలితాల్లో 86.13% ఉత్తీర్ణతతో ఖమ్మం మొద టి స్థానంలో ఉండగా, 70.69% తో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ర్యాంకు కార్డులు పంపిణీ చేస్తారు.
సీప్లో మొత్తం120 మార్కులకు గాను 30%.. అంటే 36 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణలైనట్లే. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులతో పనిలేదు. పుట్టిన తేదీ, టెన్త్ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా త్వరలో నిర్వహించబోయే వెబ్ కౌన్సెలింగ్లో వీరి ప్రతిభా క్రమాన్ని నిర్ణయిస్తారు. టాప్టెన్ ర్యాంకుల్లో ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాకు దక్కాయి. కాగా రెండు ర్యాంకులు తూర్పుగోదావరి జిల్లాకు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలకు ఒక్కో ర్యాంకు చొప్పున దక్కాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more