Seep results

seep results

seep results

5.gif

Posted: 05/20/2012 01:15 PM IST
Seep results

      సీల్ లోనూ అమ్మాయిలే తమ హవా చూపించారు. పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీప్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 2న జరిగిన 'సీప్'కు రాష్ట్రవ్యాప్తంగా 2,28,352 మంది హాజరుకాగా వీరిలో 1,84,778 మంది.. అంటే 80.92 % విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. ర్యాంకులు మాత్రం బాలురకే వచ్చా యి. బాలికల్లో 85.28% మంది, బాలురలో 79.37% మంది ఉత్తీర్ణులయ్యారు. సీప్‌లో ఈ సారి ముగ్గురికి ఫస్ట్ ర్యాంకులు లభించాయి. పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహించగా.. 118 మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు.. 3a
      గన్ని సూర్య తేజ (తూర్పుగోదావరి), గుబ్బల సాయిచంద్(పశ్చిమ గోదావరి), సత్తి రూపశ్రీ హరీందర్‌రెడ్డి (పశ్చిమగోదావరి) ప్రథమస్థానంలో నిలిచారు. రాష్ట్రంలో మొదటి పదీ బాలురకే వచ్చాయి.
సీప్ ఫలితాల్లో 86.13% ఉత్తీర్ణతతో ఖమ్మం మొద టి స్థానంలో ఉండగా, 70.69% తో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ర్యాంకు కార్డులు పంపిణీ చేస్తారు.
      సీప్‌లో మొత్తం120 మార్కులకు గాను 30%.. అంటే 36 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణలైనట్లే. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులతో పనిలేదు. పుట్టిన తేదీ, టెన్త్ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా త్వరలో నిర్వహించబోయే వెబ్ కౌన్సెలింగ్‌లో వీరి ప్రతిభా క్రమాన్ని నిర్ణయిస్తారు. టాప్‌టెన్ ర్యాంకుల్లో ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాకు దక్కాయి. కాగా రెండు ర్యాంకులు తూర్పుగోదావరి జిల్లాకు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలకు ఒక్కో ర్యాంకు చొప్పున దక్కాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former minister sharkar rao
Ysr congress leader roja says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles