ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముందు తలవంచని గుజరాత్ రాష్ట్రం సోనియాముందు మోకరిల్లదని ఘాటుగా అన్నారు. నెహ్రూతో పోల్చుకుంటే సోనియా స్థాయి ఎంత అని విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తనదైన మార్కు వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై విరుచుకుపడ్డారు. మరోవైపు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పైనా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాని కార్యాలయం ఇతరులు దయాదాక్షిణ్యాలతో నడుస్తోందని వాగ్బాణాలు విసిరారు. భావనగర్ జిల్లాలోని బోతాడ్ పట్టణంలో నెవడానుంచి బోతాడ్ వరకు 32 కిలోమీటర్ల నర్మదా పైప్లైన్ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేం సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులం. అందుకే ఏ రోజూ ఎవరి ముందూ తలవంచం అని మోడీ అన్నారు. గుజరాత్కు వ్యతిరేకంగా గతంలో ప్రథమ ప్రధాని నెహ్రూ వివక్ష ప్రదర్శించారని మోడీ ఆరోపించారు. పటేల్ సొంత రాష్ట్రం కనుకే ఆయన అలా ప్రవర్తించారన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more