తాజాగా, అధికార కాంగ్రెస్ జాబితా వెలువడటంతో పార్టీ సీనియర్లు ప్రచారంపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆరు నుంచి ఉప ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఆట మొదలైంది. ఎట్టకేలకు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించటంతో ఉప పోరు ప్రచారం వేడెక్కనుంది. మరో రెండేళ్ళలో జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న అత్యంత కీలకమైన ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ సహా, తెలుగుదేశం, కాంగ్రెస్ వైఎస్సార్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్లు ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్సభ స్థానానికి జూన్ 12న ఉప ఎన్నికలు జరగనుండగా చంద్రబాబు, జగన్లు ఇప్పటి వరకు దాదాపు పది స్థానాల్లో ప్రచారం చేశారు. జగన్ అయితే నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు కూడా మధ్యమధ్యలో విరామమిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లాలవారీ సమీక్షా సమావేశాలు, ఆసంతృప్తుల్ని బుజ్జగించడంలో ఇప్పటి వరకు నిమగ్నమయ్యారు. క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీ సమీక్షలు జరుపుతూ ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక మీదట ప్రజాపథం పర్యటనలకు స్వస్తి చెప్పి ఉప ఎన్నికల ప్రచారంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ప్రధాన ఆకర్షణ శక్తిగా భావిస్తున్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అధిష్ఠానం చెబితే ప్రచారం చేస్తానని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more