Vallabhaneni vamsi clarifies

vallabhaneni vamsi clarifies

vallabhaneni vamsi clarifies

3.gif

Posted: 04/29/2012 12:22 PM IST
Vallabhaneni vamsi clarifies

       vam_i వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని నిన్న రోడ్డుపై కలుసుకోవడం యాదృచ్ఛకమేనని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ట్రాఫిక్  జామ్ అవడం వల్ల తాను జగన్ ని కలిశానని చెప్పారు. జగన్ పలకరిస్తే తాను నమస్కారం చేశానన్నారు. తనకి ఎటువంటి రహస్య ఎజండాలేదన్నారు. ఇతరులతో రాత్రి పూట ఫోన్లలో మాట్లాడే నేతను తాను కాదన్నారు. తన మనసులో ఎటువంటి దురుద్దేశంలేదని స్పష్టం చేశారు. 
       తెలుగుదేశం పార్టీ జారీ చేసి నోటీసు తనకి అందలేని చెప్పారు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిసి వివరణ ఇస్తానన్నారు.v2 లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని, ఆ వివరాలన్నీ మీడియాకు కూడా తెలుపుతానని చెప్పారు. టిడిపి నుంచి బయటకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానన్నారు. ఆ పార్టీని వదలవసినంత అవసరం కూడా తనకు లేదన్నారు. పార్టీ నుంచి తనని బయటకు
పంపడానికి ఎవరైనా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించవన్నారు.
       జరిగిన విషయాన్ని అధినేతకే చెబుతా. పరిటాల హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ  సమర్థించటానికి నా దగ్గర ఆధారాలూ  నా కుమారుడికి పరిటాల సునీతమ్మ రవి పేరు పెట్టారు. ఎవరైనా బిడ్డలతో రాజకీయాలు చేస్తారా?'' అని ప్రశ్నించారు.
       కాగా, పరిటాల అనుచరుడిగా చెప్పుకొంటూ, ఆయన ఆస్తులపై ఆధారపడి బతుకుతున్న వంశీ.. జగన్‌ను కలవడంతో రవి ఆత్మ క్షోభిస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తంచేశారు. గుంటూరులో వారు వంశీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp coming to an end says radha
Narasimhan to continue as ap governor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles