సర్కార్ ఎక్స్ప్రెస్లో పెద్దమొత్తంలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని గుంటూరు జిల్లా తెనాలి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5బ్యాగుల్లో రవాణా అవుతున్న 55 కిలోల గంజాయి విలువ సుమారు 10లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి ఇవాళ (గురువారం) రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
కాకినాడ నుండి చెన్నై ఎగ్మోర్ వెళ్లే సర్కార్ ఎక్స్ప్రెస్లోని కోచ్ నెం-8లో 10 నెంబరు బెర్తు కింద అనుమానాస్పదంగా ఉన్న 5బ్యాగులను కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లేందుకు నిడదవోలులో రైలు ఎక్కిన నాగమణి అనే ప్రయాణీకురాలు తమ బెర్తు కింద బ్యాగులు ఉండటం గుర్తించింది. తొలుత ఇతర ప్రయాణీకులవని భావించినప్పటికీ ఎంతకీ బ్యాగు యజమానులు రాకపోవడంతో అనుమానం వచ్చి ఎస్కార్ట్ పోలీసులకు సమాచారం అందించింది. ఐదు బ్యాగుల క్లిప్పులకు తాళాలు వేసి ఉండటంతో ఎస్కార్ట్ సిబ్బంది జీఆర్పీ సిఐ రమేష్బాబుకు సమాచారం అందించారు. రైలు తెనాలి చేరుకుంటున్నదని తెలుసుకున్న రైల్వే సిఐ రమేష్బాబు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.
రాత్రి 10గంటల 45 నిముషాలకు సర్కార్ ఎక్స్ప్రెస్ ఐదో నెంబరు ఫ్లాట్ ఫాం మీదకు చేరుకోగానే బోగీలోని ఐదు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో పరిశీలించగా ఒక్కో పాలిదిన్ కవర్లో రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసి ఉంచిన 55 కిలోల ఎక్స్పోర్ట్ క్వాలిటీ గంజాయిని గుర్తించారు. బ్యాగులకు సంబందించిన వ్యక్తులు ఎవరూ అక్కడ తారసపడకపోవటం విశేషం.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more