తమ స్నేహితుడు పరీక్షలో కాపీ కొడుతుంటే పట్టుకున్న ఉపాధ్యాయుడిపై పగ పట్టిన ఇద్దరు కుర్రాళ్లు.. ఆ టీచర్ని కారుతో గుద్ది చంపేశారు. హర్యానా ఓపెన్ స్కూల్ పరీక్షలో విద్యార్థిని కాపీకొట్టడానికి అంగీకరించలేదన్న కక్షతో ఒక ఉపాద్యాయుడిని ఆ విద్యార్థి స్నేహితులుగా భావిస్తున్న ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఈ ఘటన జరుగగా, ఈ దురాగతానికి పాల్పడిన ఇద్దరిలో ఒకడైన విక్రమ్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మరొక నిందితుడు హరి ఓం పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోనెపట్లో ఉన్న రామ్జాస్ పబ్లిక్ స్కూల్లో హిందీని బోధిస్తున్న 37 ఏళ్ళ రాకేష్ కుమార్ అనే ఉపాద్యాయుడు ఒక పరీక్ష కేంద్రంలో విదులను ముగించుకొని కాలినడకన ఇంటికి వస్తున్న సమయంలో విక్రమ్సింగ్, హరిఓం అనే వ్యక్తులు రాకేష్ను అటకాయించారు.
పరీక్షలో తమ స్నేహితుడైన ఒక విద్యార్థిని కాపీ కొట్టడానికి అనుమతించాలని రాకేష్ను బలవంతపెట్టారు. అయితే రాకేష్ నిరాకరించటంతో నిందితులిద్దరు ఆ రోజు సాయంత్రం రాకేశ్ ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చి ఆయన్ని అడ్డగించారు. కొద్దిసేపు రాకేశ్తో వాదించి.. అనంతరం కారుని ఆయన మీదుగా పోనిచ్చారు. తీవ్రగాయాలతో ఆయన కిందపడిపోగా.. విచక్షణారహితంగా మరోసారి కారును రివర్స్చేసి ఆయన మీదకు ఎక్కించారు.
విక్రం, హరిఓం.. రాకేశ్ను అడ్డగించి వాదిస్తున్నప్పుడు ఆయన తండ్రి, సోదరులు ఇద్దరూ అక్కడే ఉన్నారు. నిందితులను రాకేశ్ సోదరుడు ముఖేశ్ గుర్తించారు. "అప్పుడు కారును విక్రం నడుపుతున్నాడు. వాళ్లిద్దరూ కావాలనే నా సోదరుడిమీదుగా కారును పోనిచ్చారు. రెండోసారి కారును రివర్స్ చేసి మరీ తొక్కించారు'' అని ముఖేశ్ జరిగిన ఘాతుకాన్ని వివరించారు. కాగా తీవ్రగాయాలపాలైన రాకేష్ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోయినప్పటికి కూడా ఫలితం లేకపోయింది. కాగా రాకేష్, తన మరణ వాంగ్మూలంలో హంతకులను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. పారిపోయిన మరో హంతకుడు హరి ఓంను కూడా తొందరలోనే పట్టుకుంటామని సోనెపట్ డీఎస్పీ సురేందర్ మాలిక్ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more