రాష్ట్రంలో నేను తెలియని వారెవరూ లేరన్నారు. చిన్నపిల్లాడు మొదలు పండు ముదుసలి వరకు అందరికీ తాను తెలుసన్నారు. రామయ్య ప్యూచర్ లో తల్లిదండ్రులు కూడా మరిచిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్ లో బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు బాబుమోహన్ ను చూసేందుకు ఇదే వర్ల రామయ్య రోడ్డుపై నిలుచున్నాడని , కానీ ఇప్పుడు తనెవరో తెలియదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తెలియదంటున్న వ్యక్తి ఆంద్రప్రదేశ్ లో ఉండేందుకు అనర్హుడని వ్యాఖ్యానించారు.
ఇద్దరూ ఒకే పార్టీ నాయకులు. ఒకరు మాజీ మంత్రి.. మరొకరు పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆ మాజీ మంత్రిపై పార్టీ ప్రధాన కార్యదర్శి ఛలోక్తిని విసరబోయాడు. అది కాస్తా శ్రుతిమించింది. దానితో మాజీ మంత్రికి కోపం వచ్చింది. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిపై మండిపడ్డారు. ఈ రెండు సంఘటనలకు వేదిక ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ ‘మా పార్టీలో ఓ హాస్యనటుడుంటాడు... అతనెవరు మోహన్... ఆహా కాదు బాబుమోహన్’ అంటూ తనకు ఆయనెవరో తెలియదన్నట్లుగా వ్యవహరించాడు.
తరువాత ఒక సిన్మాలోని సంఘటనను ఉదాహరిస్తూ ప్రభుత్వపక్షంపై విమర్శలు చేశారు. అది అంతా మర్చిపోయారు. కానీ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన పత్రికాప్రతినిధుల సమావేశానికి ఆ మాజీ మంత్రి, సినీనటుడు బాబుమోహన్ హాజరయ్యారు. ఆయన చెప్పాల్సినదంతా చెప్పిన తరువాత పాత్రికేయులు... ‘మీరెవరో రామ య్యకు తెలియదంట’ అని ప్రస్తావించారు. దానితో బాబు మోహన్ కోపం నషాళానికి అంటింది. కళ్లు నెత్తికెక్కి.. అహంకారం ఎక్కువైతే అంతే బ్రదర్.. అలాంటి మాటలే వస్తాయన్నారు. తాను తెలియదంటే ఈ రాష్ర్టంలో ఉండడానికే వీల్లేదంటూ ఆర్డర్ పాసు చేశారు. ముందు ఆ వ్యక్తిని వాళ్ల ఊళ్లో గుర్తుపడతారో లేదో చెప్పమను అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయనెవరో తనకు తెలియదన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మీడియా సాక్షిగానే ఒకరిపై ఒక రు సెటైర్లు వేసుకోవడం పార్టీ వర్గాలను విస్మయపర్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more