Zardari donates rs 5 crore to khwaja garib nawaz trust

Zardari donates Rs 5 crore to Khwaja Garib Nawaz trust,asif ali zardari, prime minister manmohan singh, hafiz saeed, mumbai terror attacks, ajmer sharif, india pakistan

Zardari donates Rs 5 crore to Khwaja Garib Nawaz trust

Zardari.gif

Posted: 04/09/2012 04:12 PM IST
Zardari donates rs 5 crore to khwaja garib nawaz trust

Zardari donates Rs 5 crore to Khwaja Garib Nawaz trust

ప్రధాని మన్మోహన్‌తో విందు అనంతరం పాక్ అధ్యక్షుడు జర్దారీ బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లలో అజ్మీర్‌లోని ఘుగ్రా హెలిప్యాడ్ వద్ద దిగారు. అనంతరం రోడ్డు మార్గంలో 12.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్గాకు చేరుకొని ప్రార్థనలు జరిపారు. దర్గాకు పదిలక్షల డాలర్ల (రూ.5.11 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు. జర్దారీ బృందంలోని సభ్యుడు ఒకరు ఆయన తరఫున ఈ ప్రకటన చేశారని దర్గాకు చెందిన అంజుమన్ కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఖలీముద్దీన్ ఛిస్తీ వెల్లడించారు. తనయుడు బిలావల్, అంతర్గత వ్యవహారాల మంత్రి రెహమాన్ మాలిక్ సహా 44 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో కలసి జర్దారీ దర్గాను సందర్శించుకున్నారు. ఛిస్తీ సమాధి వద్ద ఇరవై నిమిషాలు ప్రార్థనల్లో గడిపి, 42 మీటర్ల చాదర్‌ను కానుకగా సమర్పించి, పుష్ప నివాళి అర్పించారు. మానవాళికి అనుకూల పరిస్థితులు కల్పించాలని తాను ప్రార్థించినట్లు జర్దారీ దర్గాలోని సందర్శకుల పుస్తకంలో రాశారు. దర్గాకు ఇటీవలి ప్రకటించిన విరాళాల్లో జర్దారీ ప్రకటించిన విరాళమే పెద్ద మొత్తమని అంజుమన్ కమిటీ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asif ali zardari says manmohan singh must visit pakistan to maintain momentum
Kanpur boy who never missed a class in 14 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles