ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసిరాడు. నన్ను పట్టుకుంటే రూ.50 కోట్ల నజరానా ప్రకటించిన అమెరికాకు తాను ఎక్కడా దాక్కోనని, తన ఆచూకీ గురించి అమెరికన్లకు తెలియజేస్తానని వెల్లడించాడు. దమ్ముంటే ఒసామా బిన్ లాడెన్పై దాడిచేసినట్టుగా నాపైనా దాడి చేయండి అని తొడ గొట్టాడు. పాకిస్థాన్ సైనిక జనరల్ హెడ్క్వార్టర్స్కు కూతవేటు దూరంలో ఉన్న ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో దేఫా-ఎ-పాకిస్థాన్ (డీపీసీ) కౌన్సిల్ నేతలతో కలిసి పాల్గొన్న సమావేశంలో ఈ సవాల్ విసిరాడు.
అమెరికా తనపై ఇలా రివార్డు ప్రకటించడాన్ని ఎద్దేవా చేశాడు. కావాలంటే అమెరికాకు తాను ఎక్కడ ఉన్నదీ చెబుతానన్నాడు. ‘నేను గుహల్లోనో లేక పర్వతాల్లోనో దాక్కోలేదు. రావల్పిండిలో ఉన్నాను. ఇక్కడ నుంచి పంజాబ్లోని నారోవల్ వెళ్తాను. రేపు లాహోర్ చేరుకుంటాను’ అని వివరిం చాడు. తనపై అమెరికా వెల కట్టిన మొత్తాన్ని ఇస్తే, దా న్ని బలూచిస్తాన్ అభివృద్ధికి వెచ్చిస్తానన్నాడు.
ముంబై దాడులతో సంబంధం లేదని, 2008 ముంబై దాడులతో జమాత్-ఉద్-దవా, దాని కార్యకర్తలకు సంబంధం లేదని సయీద్ పునరుద్ఘాటించాడు. అమెరికా.. భారత్ ముందు మోకరిల్లి ఇలా మాట్లాడుతోందని విమర్శించాడు. తన చావును అల్లా నిర్ణయిస్తాడని, అమెరికా కాదని వ్యాఖ్యానించాడు. మరి ఈ సవాలును అమెరికా ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more