రైల్వేను ఇలా వదిలేయడమా? లేక... ప్రయాణికులపై కాస్త భారం మోపైనా, తన పదవి పోయినా బండిని భద్రంగా పరుగులు తీయించడమా? ఇవి.. రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీ తనకు తాను వేసుకున్న ప్రశ్నలు! ఆయన రెండో మార్గాన్నే ఎంచుకున్నారు! భయపడితే అడుగు ముందుకు పడదనుకున్నారు. 'ఎక్కడైతే మనసు స్వేచ్ఛగా ఆలోచిస్తుందో... ఎక్కడైతే సగర్వంగా తలెత్తుకుని తిరుగుతామో...' అనే విశ్వకవి రవీంద్రుడి సందేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
చిల్లర శ్రీమహాలక్ష్మి అంటారు. రైలు టికె ట్లు తీసుకునేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య చిల్లరతోనే. టికెట్ ధర 153 రూపాయలు అయ్యిందనుకోండి.. మీరు రెండు వంద నోట్లు ఇస్తే.. కౌంటర్లో ఏడు రూపాయల చిల్లర ఉండదు. ఆ ఏడు మీరిస్తే పది ఇస్తామంటారు. లేదంటే వదులుకోవాలి, లేదా కౌంటర్ పక్కనే ఆ చిల్లర వచ్చేవరకు వేచిచూడాలి.
ఈ సమస్యను అధిగమించడానికి త్రివేదీ ఓ మంత్రం కనిపెట్టారు. దగ్గరలోని ఐదు రూపాయలకు మొత్తం ధరను సరిచేస్తారు. అర్థం కాలేదా? 11 లేదా 12 రూపాయలు ఉంటే.. అది 10 రూపాయలు అవుతుంది. అదే 3, 4 రూపాయలు ఉంటే అది 5 రూపాయలు అవుతుంది. దీనివల్ల ఎటూ ప్లాట్ఫాం టికెట్ ధర కూడా 5 రూపాయలు అయినందున.. చిల్లర సమస్య చాలావరకు తీరుతుందనేది త్రివేదీ మంత్రం. అయితే సబర్బన్ రైళ్లకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారండోయ్!
మన రైలు పరుగులు తీయాలి! ప్రయాణికులు భద్రంగా గమ్యం చేరాలి. అలా... చేరాలంటే పట్టాలు, వంతెనలు పటిష్ఠంగా ఉండాలి. అందుకు... డబ్బులు కావాలి! డబ్బులు కావాలంటే... చార్జీలు పెంచాలి!''... అని సూటిగా, సుత్తిలేకుండా చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more