రైల్వేమంత్రి దినేష్ త్రివేది ఈ రోజు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రంలో నుంచి వెళ్లే 17 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రైళ్లను ప్రతిరోజూ ఉండేవిధంగా, కొన్నిటిని వారానికి ఒకసారి, మరికొన్నింటిని వారానికి రెండుసార్లు ఉండే విధంగా ప్రవేశపెట్టారు. కొన్ని రైళ్లను పొడిగించారు.
రాష్ట్రంలో కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లు
సికింద్రాబాద్ - బెల్లంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్
విశాఖపట్నం - చెన్నై ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ - శాలిమార్ ఎక్స్ప్రెస్
విశాఖ - సాయినగర్ షిర్టీ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ - దర్భాంగ్ ఎక్స్ప్రెస్
భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్ప్రెస్
కాచిగూడ - మధురై ఎక్స్ప్రెస్
ఆదిలాబాద్ - నాందేడ్ ఎక్స్ప్రెస్
పోరుబందర్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ - నాగ్పూర్ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ - అజ్మీర్ ఎక్స్ప్రెస్
విశాఖ - రామాపూర్ లోకమాన్యతిలక్ ఎక్స్ప్రెస్
గుణపూర్ - పలాస మధ్య ఎక్స్ప్రెస్
రాష్ట్రంలో పొడిగించపడ్డ రైళ్లు
బోధన్ - నిజామాబాద్ రైలును కామారెడ్డి వరకు
అరక్కోణం - నందలూరు ప్యాసింజర్ రైలును కడప వరకు
మధురై - తిరుపతి రైలును రామేశ్వరం వరకు పొడిగింపు
పలు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు
సికింద్రాబాద్ - తిరుపతి రైలు 2 బదులు 4 రోజులు
హైదరాబాద్ - కోల్హాపూర్ రైలు 2 నుంచి వారానికి 7 రోజులు
మధురై - తిరుపతి రైలును వారినికి 2 నుంచి 7 రోజుల వరకు పెంచారు.
రైల్వేమంత్రి దినేష్ త్రివేది ఈ రోజు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రంలో అయిదు రైల్వేస్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ప్రకటించారు. దువ్వాడ, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటిసి రెండవదశకు అనుమతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more