మిలియన్ మార్చ్... ట్యాంక్బండ్పై మహనీయుల విధ్వంసానికి దారితీసిన మార్చ్. పదిలక్షల మందితో హైదరాబాద్లో మార్చ్ చేపట్టాలనుకున్న తెలంగాణవాదుల ఆకాంక్షకు సంకేతంగా నిలవాల్సిన ఈ మార్చ్... మరోరకంగా చరిత్రలోకి ఎక్కింది. ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్బంధంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణావాదుల కోపాగ్నితో ట్యాంక్బండ్ రణరంగమైంది.
పదుల సంఖ్యలో మహనీయుల విగ్రహాలు నేలకూలాయి... రాజకీయ నాయకులపై చెప్పులు పడ్డాయి...మీడియాకూ ఆగచాట్లు తప్పలేదు. రాష్ర్టచరిత్రలో మరవలేని ఘట్టంగా నిలిచిన మిలియన్ మార్చ్ జరిగి నేటికి ఏడాది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరవలేని ఘట్టం మిలియన్ మార్చ్. తెలంగాణా ఆకాంక్షను ఘనంగా చాటేందుకు హైదరాబాద్కు చేపట్టిన ఈ మార్చ్... ట్యాంక్బండ్పై విగ్రహాల విధ్వంసంతో విమర్శల పాలైంది.అడుగడుగునా ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్బంధంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది మార్చ్. ఏ ఒక్కరినీ ట్యాంక్బండ్పైకి అనుమతించేది లేదన్న పోలీసులు...చివరకు చేతులెత్తేశారు. లక్షల మందితో చేపట్టాలనుకున్న ఈ మార్చ్ను వేలాది మందికే పరిమితం చేయగలిగినా... విగ్రహాల విద్వంసాన్ని మాత్రం ఆపలేకపోయారు పోలీసులు.
దీంతో ఆందోళనకారుల దృష్టి విగ్రహాలపైకి వెళ్లింది. ఒక్కో విగ్రహాన్నే నేలకూలుస్తూ....పదుల సంఖ్యలో విగ్రహాలను ద్వంసం చేశారు. శాంతియుతంగా సాగే మార్చ్ను నిర్బంధంతో ప్రభుత్వమే ఉద్రిక్తంగా మార్చిందని తెలంగాణావాదులు మండిపడ్డారు. ట్యాంక్బండ్పై విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణాపై వివక్షే చూపారని... ఆ ధర్మాగ్రహమే విగ్రహాల ద్వంసానికి దారితీసిందని తెలంగాణావాదులు సమర్థించుకుంటున్నారు. మిలియన్ మార్చ్ను స్పూర్తి దినంగా నిర్వహించేందుకు తెలంగానావాదులు సిద్దమౌతున్నారు.
మహనీయుల విగ్రహాల ద్వంసంపై తీవ్రంగా ఆవేధన వ్యక్తం చేసిన ప్రభుత్వం గానీ...నేతలు గానీ వాటి పునరుద్దరణపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో విగ్రహాల విద్వంస ఘట్టం...ఇప్పటికీ నిలువెత్తు సాక్ష్యంగా ట్యాంక్బండ్పై అలాగే దర్శనమిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more