నిన్న శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకరరెడ్డి, తెలుగుదేశం పార్టీ సభ్యుడు దాడి వీరభద్రరావు మధ్య జరిగిన వాదోపవాదాలు వ్యక్తిగత ధూషణలవరకూ దారితీసాయి. నువు నోర్ముయ్ అంటూ తిట్టుకునేవరకూ వచ్చింది. అంతవరకూ దారితీయటానికి ముందు పొంగులేటి, దాడి కూడా ఏడు కొండలను స్మరించుకున్నారు.
తితిదే సొమ్ము మీద కన్నేసినందువలనే అలిపిరి ఘటన జరిగిందని పొంగులేటి అనగా, ఏడు కొండలు కాదు రెండే కొండలన్నందుకే దేవుడు తీసుకెళ్ళిపోయాడని దాడి అన్నారు. అలిపిరి లో చంద్రబాబు నాయుడి కారు బాంబు దాడికి గురైందన్న విషయాన్ని పొంగులేటి గుర్తుచేస్తే, నాకు ఏడు కొండలు కాదు రెండే కొండలని వైయస్ఆర్ అన్న మాటలను దాడి గుర్తు చేసారు.
ఇంకా వెనక్కి పోతే, పాఠ్యపుస్తకాలను విద్యార్థినులకు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును వినియోగించటాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అడగగా, దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య దానికి సమాధానం చెప్పటం, పొంగులేటి సమర్థిస్తూ మాట్లాడటం జరిగింది. భక్తుల డబ్బును ప్రభుత్వ పథకాలకు వాడుకోవటమేమిటని దాడి వీరభద్రరావు ప్రశ్నించగా, మొత్తం తితిదే సొమ్ము మీదనే కన్ను వేయబట్టే అలిపిరిలో ఆ సంఘటన జరిగిందని పొంగులేటి వ్యాఖ్యానించగా దాడి వీరభద్రరావు ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ వైయస్ ఆర్ ని దేవుడు మొత్తానికే తీసుకునిపోయాడని అన్నారు.
ఆ విధంగానైనా చట్టసభల్లో ఏడుకొండలు, ఏడుకొండలవాడూ చర్చల్లో చోటుచేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more