122 2జి లైసెన్స్ లను ఒక్కసారిగా రద్దు చేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఎవరూ త్వరగా జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కీలకమైన స్థానాల్లో ఉన్నవారంతా ఏదో విధంగా తమ మాటల్లో ఆ విషయాన్ని కనబరుస్తూనేవున్నారు. కోర్టు నిర్ణయమైతే జరిగింది కానీ దాని ప్రభావం ఎలావుంటుందో చూడాలని, సమాచార వ్యవస్థ మీద ఎంతో కొంత ప్రభావమైతే తప్పక పడుతుందని, ఇలా ఆర్థిక మంత్రి, సమాచార శాఖ మంత్రి, అడపాదడపా అంటునేవున్నారు. వినియోగదారుల భారం పడుతుందేమోనన్న అనుమానాన్ని కూడా వెలిబుచ్చారు. తాజాగా, ఈ సంవత్సరంలో 4జి కూడా విడుదలవుతుందని, 2జి లో రద్దు మూలకంగా కావలసినంత చేతిలో ఉందని కూడా టెలికం మంత్రి కపిల్ సిబాల్ అన్నారు.
వీరందరితో పాటు మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా కూడా సుప్రీం కోర్టుని పునరాలోచన చెయ్యమని కోరటం విశేషం. అదే కేసులో ముద్దాయిగా సంవత్సర కాలం నుంచీ జైలులో గడుపుతున్న రాజా తన వైపు వాదనను వినకుండా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవటం తగదంటూ మరోసారి విచారించమని కోరుతున్నారు.
అన్నిటికన్నా విచిత్రంగా, ముందు వచ్చినవారికి ముందు అనే విధానంలో తప్పులేదని, అందువలన సుప్రీం కోర్టు తన నిర్ణయం పట్ల మరోసారి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. జాతీయ సంపదనంతా కేవలం వేలం ద్వారనే విక్రయించాలన్న కోర్టు నిర్ణయాన్ని మాత్రమే ప్రభుత్వం తప్పుపడుతోందని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంటే మరే విధమైన పద్థతనినీ ఎప్పుడూ అనుసరించగూడదన్నది సరైన ఫలితాలనివ్వదని ప్రభుత్వం వాదన. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వలన పట్టణాలలోనూ పల్లెల్లోనూ ఉన్న వినియోగదారులకు టెలిఫోన్ సేవలను తక్కువ ధరలకే అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నం దెబ్బతింటుందని తెలియజేసారు.
ఈ విషయంలో సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భంలో అది తప్పకుండా ఎ.రాజాకు చట్టపరంగా అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more