విప్ ధిక్కరించిన జగన్ గ్రూపు ఎమ్మెల్యేలపై వేటు పడింది. రాత్రి పొద్దుపోయాక స్పీకర్ నాదెండ్ల మనోహర్ పదహారు మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. శోభానాగిరెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వేటుపడిన వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం), అమర్నాథ్రెడ్డి (రాజంపేట), సుచరిత (పత్తిపాడు), శ్రీకాంత్రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూర్), బాబూరావు (పాయకరావుపేట), గుర్నాథ్రెడ్డి (అనంతపురం అర్బన్), కొండా సురేఖ (పరకాల), ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), బాలినేని శ్రీనివాస్రెడ్డి (ఒంగోలు), బాలరాజు (పోలవరం), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి), ప్రసాదరాజు (నర్సాపురం), పిన్నెలి రామకృష్ణారెడ్డి (మాచర్ల) ఉన్నారు. పిఆర్పీకి చెందిన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి (ఆళ్ళగడ్డ) రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.
డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక పిఆర్పీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. వారంతా పార్టీ విప్ను ఉల్లంఘించారు. విప్ ధిక్కరించిన ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సిఎల్పీ, పిఆర్పీ ఎల్పీలు స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వివరణలు కోరారు. వారంతా మూకుమ్మడిగా వచ్చి కలిశారు. కాంగ్రెస్లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీకి తనకు విప్ జారీ చేసే అధికారం లేదని, అలా చేస్తే కోర్టుకెళ్తానని శోభానాగిరెడ్డి తెలిపారు. న్యాయవాదిని వెంట బెట్టుకుని మరీ స్పీకర్ను కలిశారు. విప్ అందలేదని కాపు రామచంద్రారెడ్డి కూడా తనపై ఫిర్యాదు చేయడాన్ని అభ్యంతరం పెట్టారు. చివరికి వారిద్దరూ రాజీనామాలు చేశారు. మూకుమ్మడిగా కాకుండా వ్యక్తిగతంగా వచ్చి కలవాలని స్పీకర్ వారికి తేదీలు ఖరారు చేశారు. స్పీకర్ ఆదేశాన్ని వారు తిరస్కరించారు. స్పీకర్ సమక్షంలోనే తాము విప్ ఉల్లంఘించామని, అవిశ్వాసానికి ఓటు వేశామని, మళ్ళీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. రాజీనామా చేసినా శోభానాగిరెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తించాలని లేదా రాజీనామా అయినా ఆమోదించాలని స్పీకర్ను కోరారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారి నుండి స్పీకర్ వివరణ తీసుకున్నట్లు తెలిసింది. వేటు వేస్తే వివిధ కారణాలతో ఖాళీ అయిన ఏడు స్థానాలతో పాటు ఈ పదిహేడు స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యేలు భావించారు. అయితే ఏడు స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాతే వేటు వేయాలని మొదటి నుండీ కాంగ్రెస్ పార్టీ భావించింది. అప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. సరైన సమయం కోసం ఎదురుచూసిన స్పీకర్ వారిపై వేటు వేసినట్లు తెలిసింది. రెండ్రోజుల క్రితం జగన్కు మద్దతిస్తున్న ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామాను లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించిన విషయం తెలిసిందే. నగరానికి మీరాకుమార్ వచ్చారు. ఆమెను రాజ్భవన్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో పాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు. ఆమెను కలుసుకుని వచ్చిన తరువాతే ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ అందుబాటులో ఉన్న విలేకరుల సమక్షంలో ప్రకటన విడుదల చేశారు. 21ఎ కింద ముగ్గురిపై, 21 బి కింద పదమూడు మంది ఎమ్మెల్యేలపై వేటు వేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, విప్ ధిక్కరణ, సొంత పార్టీలో ఉండలేమని చెప్పిన శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, కొండా సురేఖలను 21ఎ కింద, విప్ ధిక్కరణ కింద మిగిలిన వారిని అనర్హులుగా ప్రకటించారు. సిబిఐ ఛార్జీషీటులో వైఎస్ పేరు చేర్చడాన్ని నిరసిస్తూ గత సంవత్సరం ఆగస్టు 24న 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అందులో కొంతమంది తిరిగి కాంగ్రెస్పార్టీ గూటికి చేరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ పదిహేడు స్థానాలకు ఆరు నెలల లోగా ఎన్నికలు జరుగుతాయి. స్పీకర్ నిర్ణయంతో రాజకీయ వేడి మరింత ఎక్కువైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more