ఇద్దరు నావికుల పొరపాటు రెండు దేశాల మధ్య విభేదాలను రేపుతోంది. దౌత్యపరంగా ఎంత సభ్యతను పులుముకుని చర్చలు చేసినా, ఎంతో కొంత కటువు చోటుచేసుకోవటం, అభిప్రాయ భేదాలు కాస్తా చాలాకాలం మర్చిపోలేని ముద్రలను వెయ్యటానికి ఎంతో అవకాశం ఉంది.
కేరళ సముద్ర తీరంలో ఇద్దరు భారతీయ మత్స్యకారుల మీద కాల్పులు జరిపి వారి మృతికి కారణమైనందుకు భారత ప్రభుత్వం వారి మీద ఇక్కడే విచారణ జరిపించాలని చెప్పటమే కాకుండా, ఈ సంఘటనకు ఇరు దేశాల దౌత్యసంబంధాలకూ ఏమీ సంబంధం లేదని స్పష్టం చేసినా, ఎలాగైనా ఆ ఇద్దరినీ చెరనుంచి విడిపించి తీసుకునిపోవాలని ఇటలీ ప్రభుత్వం సర్వ విధాలా ప్రయత్నం చేస్తోంది. దానిగురించి చర్చలు జరిపి భారత్ ని ఒప్పించటానికే ఈ రోజు ఇటలీ ఉప విదేశాంగ మంత్రి ఢిల్లీ వస్తున్నారు. వచ్చే వారం విదేశాంగ మంత్రి వస్తారు.
మరోపక్క కాథలిక్ చర్చ్ ద్వారా కూడా ఒత్తిడి పెంచుతూ, మృతి చెందిన కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని, ఇటలీ పౌరులైన ఆ ఇద్దరు నేరస్తులనూ ఇటలీ తీసుకెళ్ళి అక్కడ విచారణ చేస్తామని ఇటలీ అంటోంది. ఇటలీ చట్టం ప్రకారం ఇటలీ దేశస్తులు ప్రపంచంలో ఎక్కడ నేరం చేసినా వారిమీద ఇటలీ లోనే విచారణ జరగాలని, అందువలన వాళ్ళని తిరిగిచ్చేయమని ఇటలీ వాదన.
కానీ, భారతీయుడి మీద కానీ భారతీయ నౌక మీద కానీ నష్టానికి గురిచేస్తూ నేరం చేస్తే అది ఎక్కడ జరిగినా సరే భారతదేశంలోనే దాని విచారణ జరగాలని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 4 చెప్తోంది. అందువలన, మనవాళ్ళు మన చట్టం ప్రకారమే ఈ కేసులో ముందుకెళ్ళాలని అనుకుంటున్నట్టుగా ఉన్నత స్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. నేవీ ఓడల కి చెందిన చట్టాలను ఈ వాణిజ్య ఓడకు కూడ వర్తింపజేయాలనుకోవటం ఇటలీ అత్యుత్సాహాన్ని తెలియజేస్తుందన్నారు వాళ్ళు.
మొత్తానికి ఈ వివాదాన్ని ఇటలీ అంత సులభంగా వదిలిపెట్టేట్టుగా లేదు. భారత్ కూడా వెనక్కి తగ్గటం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more