ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులను ఖరారు చేయడంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పై చేయి సాధించినట్లు తెలుస్తోంది. ఏడు స్థానాలకు కిరణ్ రూపొందించిన అభ్యర్థుల జాబితానే ఎఐసిసి ఖరారు చేసి ప్రకటన చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్ళిన బొత్సతో అధిష్టానం మాటమాత్రానికైనా చర్చించలేదు. రెండు మూడు నియోజకవర్గాల్లో పేర్ల విషయమై తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆయన ఢిల్లీ వెళ్ళినట్లు తెలిసింది. విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే ఎఐసిసి జాబితాను విడుదల చేయడంతో బొత్స కంగుతిన్నారు. ఢిల్లీ వచ్చిన తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన ఢిల్లీ పర్యటన వివరాలు తెలియకపోయినా ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తామన్న విషయాన్ని తనకు చెప్పకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2009 ఎన్నికల సమయంలోనూ వైఎస్ రాజశేఖర్రెడ్డి అధిష్టానం వద్ద చక్రం తిప్పి 290 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడుగా డి.శ్రీనివాస్ ఉన్నా ఆయనకు జాబితా విడుదలను ఎఐసిసి తెలియజేయలేదు. ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి కూడా బొత్సకు తెలియనీయకుండా జాబితా విషయంలో జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more