ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో నిందితులుగా విచారణనెదుర్కుంటున్న ఐఎఎస్ శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్ గా వ్యవహరించిన రాజగోపాల్ లు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా విచారణకు కూడా ఉపయోగపడతారని, వారిని విచారించటానికి అనుమతి కావాలని సిబిఐ కోర్టుని కోరగా, శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వి సురేందర్ రావు వారిని సాక్షిగా పిలుస్తున్నారా లేక నిందితులుగానా అని అడిగిన దానికి, విచారణ జరిగితే కానీ వాళ్ళు సాక్షులో నిందితులో చెప్పలేమని సిబిఐ తరఫు న్యాయవాది బి.రవీంద్రనాథ్ అన్నారు.
మరి ఎలాంటి పత్రాలనూ సమర్పించకుండా విచారిస్తాననటం సరికాదు కదా అని సురేందర్ రావు అన్నదానికి, ప్రస్తుతం దర్యాప్తులో ఉండటం వలన కేసుకి సంబంధించి ఎటువంటి పత్రాలనూ సమర్పించటం కుదరదని రవీంద్రనాథ్ అన్నారు. దర్యాప్తు సంస్థని వారి దగ్గరున్న ఆధారాలను చూపమనటం కూడా సరికాదు కాని, దొరికినవారిని అన్ని దర్యాప్తులకూ వాడుకుంటామనటం కూడా సరికాదని శ్రీలక్ష్మి తరఫునుంచి భావిస్తున్నారు. నోటీసులు జారీ చెయ్యకుండా నేరుగా వచ్చి కోర్టుని అడగటమేమిటని సిబిఐ ధోరణిని తప్పుపట్టారు.
వాదోపవాదాలను విన్న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం శ్రీలక్ష్మి విషయంలో విచారణను ఫిబ్రవరి 21 కి, రాజగోపాల్ విషయంలో ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more