ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్‑ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ప్రణాళికేతర వ్యయం : రూ.91,824 కోట్లు
ప్రణాళిక వ్యయం : రూ. 54,030 కోట్లు
వివిధ రంగాలకు కేటాయించన బడ్జెట్ అంకెల్లొ......
బడ్టెట్ కేటాయింపులపై వివిధ పార్టీల నాయకులు పెదవి విరిసారు. రాష్ట్ర బడ్జెట్పై విపక్షనేత చంద్రబాబు కేటాయింపులన్నీ ఆశ్చర్యం కలిగించాయన్నారు. జలయజ్ఞం గుది బండగా మారిందన్న బాబు... వివిధ రంగాలకు కేటాయించే నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. సమాన్యులపై పన్నుభారం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. అవినీతి, పన్నుల భారంతో ప్రభుత్వం పేదవాళ్ల రక్తం తాగుతోందని మండిపడ్డారు. లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాల కేటాయింపుల కన్నా, మన రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం మీద నిధుల కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని జేపీ విమర్శించారు. నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నామని కాగితాల మీద అంకెలు మాత్రమే చూపిస్తున్నారని, వాస్తవానికి నిధుల కేటాయింపు సక్రమంగా జరగడం లేదని జేపీ ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more